ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ మూవీని పొగడకుండా విమర్శించిన వారు చాల అతితక్కువ మంది. అయితే ఈమూవీలో తనకు ఎటువంటి గొప్పతనం ఏమి కనిపించలేదు అంటూ ఒకనాటి ప్రముఖ హీరోయిన్ జమున ప్రముఖ నటుడు సత్యనారాయణ గతంలో ఓపెన్ గానే కామెంట్ చేసి మీడియాకు అప్పట్లో హాట్ న్యూస్ గా మారారు.


అయితే ‘బాహుబలి’ సృష్టి కర్త రాజమౌళి ఏకంగా తనకు తానే తన మూవీ పై కామెంట్ చేయడం నేటి హాట్ టాపిక్. లాక్ డౌన్ తో విపరీతమైన ఖాళీ దొరకడంతో సినిమా దర్శకులు రచయితలు హీరోలు వివిధ ప్రపంచ భాషలకు సంబంధించిన సినిమాలు చూస్తూ ఆ సినిమా కథలు తెలుగు ప్రేక్షకులకు ఏమైనా పనికి వస్తాయా అన్న కోణంలో లోతుగా తమలో తాము విశ్లేషించుకుంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి ఈమధ్య ఆస్కార్ అవార్డ్ పొందిన కొరియన్ మూవీ పారసైట్ మూవీ చూసాడట. అయితే ఈ మూవీ చూస్తుండగానే రాజమౌళి తనకు తెలియకుండానే తాను పడుకున్నాడట. ఈ విషయాన్ని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పినప్పుడు ఆ మీడియా సంస్థ ప్రతినిధి ఆశ్చర్యపడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొందిన పారసైట్ మూవీ చూస్తూ నిద్ర ఎలా పెట్టింది అని అడిగాడు. 


దానితో ఖంగుతిన్న రాజమౌళి తన ‘బాహుబలి’ సినిమాను చూస్తూ నిద్రపోయిన వారు కూడ ఉన్నారు కదా అంటూ జోక్ చేసాడు. దీనితో ఎప్పుడో జమున చేసిన కామెంట్స్ కు ఇప్పుడు రాజమౌళి ఇలా సమాధానం ఇచ్చాడు అనుకోవాలి. అంతేకాదు ‘బాహుబలి’ ని విమర్శించిన వారి విమర్శలను కూడ జక్కన్న సీరియస్ గా తీసుకున్నాడు అన్న విషయం కూడా స్పష్టం అవుతుంది. దీనితో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేసిన ‘బాహుబలి’ పై తనకు తానే జోక్ చేసుకున్న వ్యక్తిగా రాజమౌళి మరొక సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకున్నాడు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: