టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడు గా పేరు తెచ్చుకున్న ఎస్ ఎస్ రాజమౌళి తీసిన సినిమాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.  ఆయన తెరకెక్కించిన ఈగ మొదలు మొన్నటి బాహుబలి, బాహుబలి 2 మూవీస్ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి.  మొదటి నుంచి జక్కన్న సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది..ఆయన సినిమాల్లో హీరోయిజం మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది.  ప్రభాస్ గతంలో వరుస ఫ్లాపులతో సతమతవుతున్న సమయంలో చత్రపతి తీశారు. ఆ దెబ్బతో ప్రభాస్ జాతకం మారిపోయింది.. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలకు కూడా మంచి బ్రేక్ ఇచ్చారు.

 

 ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగు మళ్లీ మొదలుకానుంది. మిగిలిన షూటింగుకి సంబంధించిన అన్ని పనులు సిద్ధంగానే వున్నాయట. ఈ మూవీ తర్వాత రాజమౌళి ఎవరితో తీస్తారని తెగ చర్చలు జరుగుతున్నాయి. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్నాడు. అందుకోసం తన దగ్గరున్న స్టోరీ లైన్స్ ను రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ వినిపిస్తున్నారట.  శ్రీమంతుడు మూవీ నుంచి వరుస విజయాలు అందుకుంటున్నాడు మహేష్ బాబు.

 

 ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో మూవీ అంటే ఓ రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.  అందుకోసం  రాజమౌళికి లైన్ నచ్చితే అప్పుడు ఆ లైన్ ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో విజయేంద్ర ప్రసాద్ వున్నారని అంటున్నారు. అంతే కాదు తన నుంచి ఇం తవరకూ రాని జోనర్లో కథ వుండాలనీ, మహేశ్ బాబు ఇంతవరకూ చేయని పాత్రై వుండాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇక ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: