తెలుగు చిత్ర నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎన్టీఆర్ ఏ పాత్రలోనైనా నట విశ్వరూపం చూపిస్తారు అనే విషయం తెలిసిందే. తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న  ఎన్టీఆర్.. అందరిని మెస్మరైజ్ చేసే నటనతో పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా రౌద్రం గా ఉండే పాత్రలో అయితే ఎన్టీఆర్ జీవిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించి భారీ విజయాన్ని అందుకున్నాడు. మామూలుగానే త్రివిక్రమ్ సినిమా అంటే పంచు డైలాగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి అనే విషయం తెలిసిందే. 

 

 దానికి తోడు ఎన్టీఆర్ యాక్షన్ తోడయింది అంటే ఆ పంచ్ డైలాగులకు మరింత పవర్ చేకూరుతుంది. అరవింద సమేత సినిమాలో కూడా అదే జరిగింది. త్రివిక్రముడు సమకూర్చిన పంచ్ డైలాగులను ఎన్టీఆర్ చెబుతుంటే ప్రేక్షకులు మైమరచిపోయారు అనే చెప్పాలి. రౌద్రం గా చెప్పిన డైలాగ్ ల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమాలో పంచ్ డైలాగులతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరిని ఆలోచింప చేశారు అని చెప్పాలి. మామూలుగానే త్రివిక్రమ్ పెన్ను కు పదునెక్కువ... అందుకే ఆ కలం నుంచి ఎన్నో పవర్ ఫుల్ పంచ్ డైలాగులు జాలువారుతూ ఉంటాయి. అయితే అరవింద సమేత సినిమాలో ఎన్నో పంచ్ డైలాగులు ఉన్నప్పటికీ ప్రేక్షకుల నోళ్ళలో ఎక్కువగా వినిపించిన పంచ్ డైలాగ్  ఒకటి ఉంది.

 

 ఆ డైలాగ్ కంట పడ్డావా కనికరిస్తానేమో... వెంట పడ్డానా నరికేస్తా ఓబా... అంటూ ఎన్టీఆర్ ఫైట్ చేస్తూ రౌద్రంగా సింహాల గర్జిస్తున్నట్టుగా... చెబుతున్న డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది అని చెప్పాలి. అరవింద సమేత సినిమా విడుదలైనప్పటి నుంచి చాలా రోజుల పాటు ప్రేక్షకులను నోళ్ళల్లో డైలాగ్ నానుతునే ఉంది . ఇక ఎన్టీఆర్ తన రౌద్రమైన  వాయిస్ తో నట విశ్వరూపాన్ని చూపిస్తు ఈ డైలాగ్ చెప్పడంతో ఇది చూస్తున్న సినీ ప్రేక్షకులు అందరూ మంత్రముగ్దులను అయ్యారు అని చెప్పాలి. అయితే ఈ డైలాగ్ ఒక్కటే కాదు చాలా డైలాగులు ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: