కింగ్ నాగర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించి చిత్రం `శివమణి`. ఆసిన్, రక్షిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కాష్ రాజ్, ఆలీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. 2003 లో విడుదలైన ఈ యాక్షన్ ప్రేమకథా చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. డి.వి.వి.దానయ్య సమర్పణలో వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించాడు. మరియు ఈ చిత్రానికి చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.
అయితే ఈ సినిమాలో `నా పేరు శివమణి… నాకు కొంచెం మెంటల్.. పూర్ణామార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని.. ఇప్పటి వరకూ ఎవరు ఏం చేశారని నేను అడగా.. కానీ, అన్నీ ఆపేయండి. సడన్గా నేనొచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి, మానడానికి ట్రై చేయండి’ అంటూ అంతకుముందు ఎన్నడూ కనిపించని ఓ స్పెషల్ బాడీ లాంగ్వేజ్తో ఈ చిత్రంలో సందడి చేశారు నాగ్. ఈ డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ కూడా నాగార్జున్ చెప్పిన డైలాగ్ వినిస్తునే ఉంటుంది. ఇక ఈ సినిమాలో `శివమణి 98480 22338’ది ప్రత్యేక స్థానం`.
ఈ నెంబర్ను మరియు నాగార్జున చెప్పిన `నా పేరు శివమణి… నాకు కొంచెం మెంటల్` డైలాగ్ను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక నికోలస్ స్పార్క్స్ రచించిన ‘మెసేజ్ ఇన్ ఎ బాటిల్’ నవల ఆధారంగా ఇందులోని కొన్ని సన్నివేశాలను రూపొందించారు. ఇక నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఎన్ని వేసినా శివమణి తరువాతే అనడంతో ఏ మాత్రం సందేహం లేదు. అంతగా శివమణి సినిమాలో నాగ్ ఆకట్టుకున్నాడు. మరియు ఈ సినిమాలో ప్రతి సాంగ్ హైలైట్ అని చెప్పుకోవాలి. కాగా, నాగార్జున ఇటీవల మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 చేయగా.. ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద బోల్తా పడింది. ఇక ప్రస్తుతం నాగార్జున టైటిల్ రోల్లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నటిస్తున్నారు.