టాలీవుడ్ లో చిరంజీవి సినిమాలు అనగానే ప్రేక్షకులకు ముందు నుంచి కూడా ఒకరకమైన క్రేజ్ ఉంటుంది అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. ఆయన సినిమా ల కోసం పనులు మానుకుని చూసే జనాలు కూడా ఉన్నారు అనేది అందరికి అర్ధమవుతు ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన సినిమా విడుదల చెయ్యాలి అంటే భయపడుతున్నారు అనే వార్తలు ఎక్కువగా టాలీవుడ్ లో వినపడుతున్నాయి. టాలీవుడ్ జనాలు ఆయన సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు అనే భావన లో చిరంజీవి ఉన్నారు అని అంటున్నారు. 

 

ఆయన ఇప్పుడు తన కొడుకు నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ సినిమాలో చిరంజీవి ఒక ప్రభుత్వ ఉద్యోగి గా కనపడే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కథ విషయంలో స్పష్టత ఏదీ లేకపోయినా సరే జనాలు మాత్రం కథ గురించి అనేక విధాలుగా చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమాను ఎలా అయినా సరే వచ్చే ఏడాది విడుదల చెయ్యాలి అని చూస్తున్నారు. 

 

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా విడుదల చెయ్యాలి అని రామ్ చరణ్ చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఎక్కడ నష్టాలు వస్తాయో అనే ఆందోళన చిరంజీవి లో బాగా ఉందని సమాచారం. ఆయన ముందు నుంచి కూడా ఈ సినిమాను పాన్ ఇండియా గా వద్దు అని చెప్తున్నారు. అయినా సరే రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా సినిమాగానే దీన్ని తీసుకు రావాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: