టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘బద్రి’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  మొదటి సినిమాతోనే విజయం అందుకోవడం చాలా అదృష్టం.. అదే మనోడికి బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత మాస్ మహరాజ రవితేజతో ‘ఇడియట్’ మూవీ మరో సంచలన విజయం అందుకుంది.  ఇంకేముందు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో ఓ మూవీ తీసే అవకాశం దక్కించుకున్నాడు.  ఇలా వరుస విజయాలు అందుకుంటున్న సమయంలో మహేష్ బాబు తో ‘పోకిరి’ తో బాక్సాఫీస్ షేక్ చేశాడు.  అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కొత్త రికార్డులు సృష్టించింది.  అలా వరుస విజయాలు అందుకున్న పూరి జగన్నాథ్ ‘టెంపర్’ మూవీ తర్వాత వరుస డిజాస్టర్స్ అందుకున్నాడు. తన తనయుడితో తీసిన సినిమా ఫ్లాప్ అయ్యింది.

 

ఇలా వరుసగా అపజయాలు అందుకుంటున్న పూరి గత ఏడాది రామ్ హీరో గా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మంచి మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్, పూరి కల నెరవేరింది.  ఇప్పుడు అర్జున్ రెడ్డి తో సూపర్ హిట్ అందుకొని యూత్ క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలోని 'ధారావి' స్లమ్ ఏరియా నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. ఇక్కడే విజయ్ దేవరకొండపై చాలా సన్నివేశాలను ప్లాన్ చేశారట.

 

ఇప్పుడు మహరాష్ట్ర పరిస్థితి అందులోనూ ధారావి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.  లాక్ డౌన్ కారణంగా షూటింగు ఆగిపోయింది. ఈ సమయంలో అక్కడ షూటింగ్ జరపడానికి అంత తేలికగా అనుమతులు లభించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కథా నేపథ్యంతో ముడిపడిన ప్రాంతంలోనే షూటింగు జరుపుకునే అవకాశం లేకుండా పోవడంతో పూరీ అలాంటి సెట్టింగ్ తో పూర్తి చేస్తాడా లేక లొకేషన్ చేంజ్ చేస్తారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: