ట్విట్టర్ వేదికగా మన టాలీవుడ్ హీరోలు చేస్తున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో తెలిసిన విషయమే. ఏ ముహూర్తాన సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాడో కానీ.. చిరంజీవి స్టాలిన్ సినిమాలో ‘ఒకరు మరో ముగ్గురికి చెప్పండి’ తరహాలో సెలబ్రిటీలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. కీరవాణి విసిరిన ఛాలెంజ్ ను దర్శకుడు క్రిష్ పూర్తి చేసాడు. అయితే.. ఇక్కడ క్రిష్ మరే సెలబ్రిటినీ నామినేట్ చేయకుండా ఏకంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు.

 

 

కీరవాణి సర్.. మీరు చేసిన ఛాలెంజ్ ను పూర్తి చేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ స్వీకరించాలని కోరతున్నాను. ఈ ఛాలెంజ్ ద్వారా ఇంటి పనులు చేసి తమ ఇళ్లలోని ఆడవారికి సాయపడాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకూ ప్రతి సెలబ్రిటీ మరో ముగ్గురు, నలుగురు సెలబ్రిటీలను మాత్రమే నామినేట్ చేశారు. కానీ.. క్రిష్ ఏకంగా లక్షలాది మంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు. క్రిష్ ఛాలెంజ్ కు అప్పుడే పవన్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతూ ఈ ఛాలెంజ్ ను వైరల్ చేసేస్తున్నారు.

 

 

‘సర్.. ఇంతవరకూ ఎవరూ ఫ్యాన్స్ ను నామినేట్ చేయలేదు. మా పవర్ ఏంటో చూపిస్తాం’ అంటూ రిప్లైలు ఇచ్చేస్తున్నారు. పవన్ పేరు చెప్తేనే పూనకాలతో ఊగిపోయే ఫ్యాన్స్ ఈ ఛాలెంజ్ ను మరింత ఉధృతంగా తీసుకెళ్లేట్టున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలు అందరూ తమ ఇంట్లో పనులు చేస్తూ ఫ్యాన్స్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ఈ ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ను ఓ రేంజ్ లో చేసి నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేట్టున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: