నాగ చైతన్య ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ లో సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో 19వ సినిమాగా ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమాలో చైతూ కి జంటగా సాయిపల్లవి నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఈ పోస్టర్‌, టీజర్ ప్రేక్షకులనుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే గతంలో నాగ చైతన్య సమంత నటించిన ఏం మాయ చేశావే సినిమా మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేస్తుందన్న ఫీల్ లో ఉన్నారు. అందుకు కారణం ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కడమే.

 

ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా  కరోనా కారణంగా బ్రేక్ పడింది. ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన కార్యక్రమాలన్నిటిని శేఖర్ కమ్ముల ఆపేశారని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే లవ్ స్టోరీకి ఇప్పుడు భారీ సినిమాలన్ని గట్టి పోటీగా ఉన్నాయట. నాని " వి", అనుష్క "నిశబ్ధం", పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్", రవితేజ "క్రాక్" .. వంటి భారీ సినిమాలు రిలీజ్ కి క్యూలో ఉన్నాయి. మజిలీ తర్వాత చైతూ కి చాలా గ్యాప్ రావడం ఒకటి సాయి పల్లవికి ఫిదా తర్వాత మళ్ళీ హిట్ లేకపోవడం తో కాస్త రిజల్ట్ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. దీంతో ఈ భారీ సినిమాల మధ్య లవ్ స్టోరీ తట్టుకొని నిలబడుతుందా అని ఫిల్మ్ నగర్ లో చర్చ సాగుతోంది. 

 

అక్కినేని నాగ చైతన్య మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో భార్య భర్తలైన నాగ చైతన్య సమంత ఈ సినిమాలోను భార్యా భర్తలుగా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి జాను సినిమాలో కలిసి నటించాల్సి ఉండగా సమంత మాత్రమే నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాట లేకపోయింది. మజిలీ, ఓ బేబి తర్వాత హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందనుకున్న జాను సినిమా సమంతకి షాకిచ్చింది. అంతేకాదు నిర్మాత దిల్ రాజు తో పాటు, శర్వానంద్ కి గట్టి షాకే ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: