అందరు ఒకదారిలో వెళ్తే తాను మరోదారి వెతుక్కుంటా అంటూ తన మొదటి సినిమా నుండి కొత్తగా ట్రై చేస్తున్నాడు అడివి శేష్. మొదట్లో అతని సినిమాలను ఎవరు పట్టించుకోలేదు అయినా నిరాశ పడకుండా ప్రయత్నించినా అడివి శేష్ కు క్షణంతో ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఆ సినిమా కథ అడివి శేష్ రాశాడని తెలిసిన ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఇక ఆ సినిమా నుండి అడివి శేష్ సినిమా అంటే ఫుల్ ఆఫ్ సర్ ప్రయిజెస్ అనేలా చేస్తున్నాడు. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా.. ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధం అనేలా ఉన్న అడివి శేష్ అందుకు తగిన క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు. 

 

2018లో గూఢచారి, 2019లో ఎవరు ఇలా ఇయర్ కు ఒకటి తన మార్క్ చూపించే సినిమాతో వస్తున్న అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్నాడు. 26/11 ఎటాక్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చూపించిన తెగువని కథాంశంగా ఈ ఈ మేజర్ సినిమా తెరకెక్కుతుంది. గూఢచారితో సూపర్ హిట్ అందుకున్న శశి కిరణ్ టిక్కా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని జి.ఎం.బి ప్రొడక్షన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీరు ఊహించని సర్ ప్రయిజ్ లు ఉంటాయని అంటున్నాడు అడివి శేష్.

 

కచ్చితంగా ఈ సినిమా ఆడియెన్స్ ను అలరిస్తుందని చెబుతున్నాడు ఈ మేజర్ హీరో. ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అడివి శేష్ మేజర్ సినిమాతో పాటుగా గూఢచారి 2 కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.               

మరింత సమాచారం తెలుసుకోండి: