యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. వాస్తవానికి 'అరవింద సమేత' విడుదలైన సమయంలోనే వీరి కాంబోలో మరో మూవీ ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి హీరోయిన్ విషయంలో రోజుకొక రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. ఇంతకముందు జాన్వీ కపూర్, పూజాహెగ్డే అన్నారు.. తర్వాత రష్మిక మదన్న అంటున్నారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ అయితే రాలేదు.

 

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాసులు డైలీ ఫోన్ కాల్స్ ద్వారా ఈ స్క్రిప్ట్ డెవలప్మెంట్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారట. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. త్రివిక్రమ్ ఎప్పటిలాగే తన మార్కు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా తెరకెక్కించనున్నారని కొందరు అంటుంటే.. ఈ సారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ పొలిటికల్ థ్రిల్లర్ ట్రై చేయనున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ యంగ్ అండ్ స్టైలిష్ కార్పొరేట్ దిగ్గజంగా చూపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. బిసినెస్ వరల్డ్ లో సక్సెస్ ఫుల్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా ఎన్టీఆర్ లుక్ ఆటిట్యూడ్ ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే ఎన్టీఆర్ ని గతంలో చూడని ఓ కొత్త అవతారంలో చూడవచ్చు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతక ముందు వచ్చిన 'అరవింద సమేత.. వీర రాఘవ' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వీరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: