టాలీవుడ్ నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీర్ ‘టెంపర్’ మూవీ తర్వాత భలే లక్కీ ఛాన్సులు కొట్టేస్తున్నాడు.  వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు.  జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింత సమేత ఇలా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు.  ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్ ’ మూవీలో నటిస్తున్నాడు.  ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్నాడు.   ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

 

మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని త్రివిక్రమ్ మూవీకి రెడీ అయ్యాడు ఎన్టీఆర్.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ ఫ్యాక్షనిజంపై వచ్చింది. అక్కడ మగవారి డామినేషన్ ఎలా ఉంటుందో చూపించారు.  ఆడదంటే లాలించే అమ్మే కాదు.. పాలించే తల్లి అనే కాన్సెప్ట్ పై వచ్చింది. ఇప్పుుడు త్రివిక్రమ్ - ఎన్టీఆర్  మూవీ స్టోరీ లైన్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో యంగ్ అండ్ స్టైలిష్ కార్పొరేట్ దిగ్గజంగా కనిపించనున్నాడని తెలుస్తుంది.  

 

ఇందులో ఎన్టీఆర్ లుక్ ఆటిట్యూడ్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది.  ఈ సినిమాలో మరోసారి పూజ హెగ్డేను హీరోయిన్ గా ఎంపికచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  త్రివిక్రమ్, ఎన్టీఆర్, పూజా కాంబినేషన్లో అరవింద సామెత చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా హాసిన హారిక బ్యానర్ లో  తెరకెక్కుతుంది.  ఆ మద్య మహర్షిలో మహేష్ బాబు బిగ్గెస్ట్ బిజినెస్ మాన్ గా కనిపించిన విషయం తెలిసిందే.  లవ్ ను .. ఎమోషన్స్ ను కలుపుకుని ఈ కథ నడుస్తుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: