దక్షిణాది సినీ పరిశ్రమకు సబంధించి టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో ఉండే పేరు నయనతార. తన క్రేజ్ కు తగ్గట్టు 5కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందని అంటారు. చిరంజీవి, రజనీకాంత్ సినిమాలైనా సరే ప్రమోషన్లకు వెళ్లదు. ఆన్ లొకేషన్ లో డిమాండ్లూ ఎక్కువే. ఇంతగా ఆమె టెంపర్ గా ఉంటుందని తెలిసినా దర్శక, నిర్మాతలకు తమ సినిమాల్లో నయనతారే ఫస్ట్ ప్రిఫరెన్స్. అటువంటి నయనతార ఇకపై ఓ మెట్టు దిగనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.

 

 

రీసెంట్ గా మళయాళంలో ఓ సినిమా చేసేందుకు సైన్ చేసిందట ఈ భామ. ఇందులో చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట దర్శకుడు. దీంతో వెంటనే ఈ సినిమా చేస్తానని మాటిచ్చిందట. సినిమా ప్రమోషన్లకు కూడా హాజరవుతానని మాటిచ్చిందట. ప్రస్తుతం ఈ వార్తలు విన్నవారంతా నయనతారకు ఏమైంది అనుకుంటున్నారట. ఇంతగా ఆమె డెసిషన్ లో మార్పులు రావడానికి కారణాలు ఏంటో అని అనుకుంటున్నారట. మాతృభాష సినిమా కావడంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కూడా అంటున్నారు. నయనతారలో వచ్చిన మార్పు అందరికీ సంతోషమే. ఇకపై తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తే నయన్ ప్రమోషన్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

 

 

ఈ వార్తలపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది. నయన్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి 16ఏళ్లు దాటుతున్నా అదే అందంతో దూసుకుపోతోంది. నయనతారకు ఉన్న స్టార్ హీరోయిన్ ఇమేజ్ మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆమె తీరుపై తమిళ నిర్మాతల సంఘం ఆమధ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ.. కరోనా నేపథ్యంలో ఫెఫ్సీకి 20లక్షలు విరాళం ఇవ్వడంతో ఆమె చారిటీ చూసి అందరూ గమ్మునుండిపోయారు. ఎంతగా ఎన్ని విమర్శలు వచ్చినా మరే హీరోయిన్ చేయలేనంత చారిటీ చేసి తానెప్పుడూ స్పెషలే అనిపించుకుంది మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: