లాక్ డౌన్ టైంలో టాలీవుడ్ స్టార్స్ అంతా బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ కొనసాగిస్తున్నారు. సందీప్ వంగ రాజమౌళికి ఆ ఛాలెంజ్ విసరగా.. అక్కడ నుండి ఎన్టీఆర్,  చరణ్, చిరంజీవి, వెంకటేష్, కీరవాణి, క్రిష్, అనీల్ రావిపూడి, శోబు యార్లగడ్డ దగ్గరకు వచ్చింది. అయితే బాహుబలి నిర్మాత ఈ ఛాలెంజ్ స్వీకరించి మన బాహుబలి అదేనండి ప్రభాస్ కు ఈ టాస్క్ కు నామినేట్ చేశాడు. అంతేకాదు అల్లు అర్జున్ కు శోబు యార్లగడ్డ ఛాలెంజ్ విసిరాడు. రాజమౌళి దగ్గర నుండి అనీల్ రావిపూడి వరకు ఈ ఛాలెంజ్ కొనసాగగా.. ఎన్టీఆర్ నుండి వెంకటేష్ వరకు ఈ టాస్క్ ఇచ్చినా అల్లు అర్జున్ ను వదిలిపెట్టారు. 


తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ తాను ఎంత క్లోజ్ గా మూవ్ అవ్వాలని అనుకుంటున్నా మిగతా హీరోలు అతన్ని దూరం పెట్టేస్తున్నారని టాక్. అయితే అలాంటిదేమి లేదన్నట్టుగా ఈమధ్య అల వైకుంఠపురములో సక్సెస్ తో ప్రూవ్ అయ్యింది. ఆ సినిమా సక్సెస్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ బన్నీకి స్పెషల్ విషెష్ అందించారు. అయితే సోషల్ మీడియాలో ఛాలెంజ్ ల  అర్జున్ ని కాస్త పక్కన పెట్టారు. రాజమౌళి నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ కొనసాగగా.. శోభు యార్లగడ్డ మాత్రమే అల్లు అర్జున్ ను నామినేట్ చేశాడు. హీరోలెవరైనా అల్లు అర్జున్ ను చేస్తారని అనుకోగా అది జరగలేదు. 


అల్లు అర్జున్ మిగతా హీరోలతో ఎంత క్లోజ్ గా ఉందామని అనుకున్నా అది సాధ్యపడట్లేదు. అయితే ఫైనల్ గా ఎలాగోలా అల్లు అర్జున్ ని కూడా ఈ టాస్క్ లో భాగం చేశారు. ఓ పక్క మెగా లేడీస్ అంటా నో మేకప్ ఛాలెంజ్ తో సందడి చేస్తుంటే.. అందులో మాత్రం అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి యాక్టివ్ గా పాల్గొన్నారు. 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: