టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. ఆమె చేసిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఏ ఒక్క హీరోయిన్ కూడా చేయలేదు అనేది వాస్తవం. వరుస ఆఫర్లతో ఆమె ఒక వెలుగు వెలిగింది అనేది అందరికి అర్ధమైన విషయం. ఆమెతో సినిమా చేసిన వారిలో అన్ని టాలీవుడ్ టాప్ హీరోల కుటుంబాలు ఉన్నాయి. చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా ప్రతీ ఒక్కరు కూడా సినిమా చేసారు ఆమె తో. ఇక ప్రభాస్, మహేష్ బాబు వంటి వారు కూడా ఆమె తో సినిమా చేసారు. ఈ మధ్య కాలంలో ఏ ఒక్క హీరోయిన్ కూడా చేయలేదు ఇలా. 

 

ఇప్పుడు ఆమెకు వయసు మీద పడింది. ఆమెకు వరుస ఆఫర్లు రావడం ఆగిపోయింది. అయినా సరే ఆమె మాత్రం సినిమాలు చేసే విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. అగ్ర హీరో సినిమా కోసం ఆఫర్ వస్తే భారీగా డిమాండ్ చెయ్యాలి అని చూస్తుంది. వెంకటేష్ హీరోగా ఒక సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ చెయ్యాలి అని చూసింది. ఈ సినిమా కోసం ఆమె భారీగా డిమాండ్ చేసినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు రెండు కోట్ల వరకు అడిగింది అంటున్నారు టాలీవుడ్ జనం. 

 

దీనితో ఆమెను చిత్ర యూనిట్ పక్కన పెట్టింది అనేది టాలీవుడ్ జనాల మాట. ఈ స్థాయిలో ఆమె డిమాండ్ చేస్తుంది అని చిత్ర యూనిట్ అనుకోలేదు. టాలీవుడ్ లో ఆమె చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. అయినా సరే ఆమె ఈ విధంగా డిమాండ్ చెయ్యాలి అనుకోవడం మాత్రం నిజంగా షాకింగ్. ఎం చూసుకుని ఇంత డిమాండ్ చేస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: