ఆంధ్రప్రదేశ్ రాజధాని మారడం ఏమో గాని టాలీవుడ్ జనాలు మాత్రం ఇప్పుడు భూముల గురించి ఎక్కువగా కంగారు పడుతున్నారు. చాలా మందికి కంటి మీద కునుకు ఉండటం లేదు. విశాఖకు రాజధాని తరలించాలి అని జగన్ సర్కార్ ప్రయత్నాలు చేయడం దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా రావడం తో ఇప్పుడు మన తెలుగు  సినిమా జనాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అనుష్క, త్రివిక్రమ్ సహా కొందరికి అమరావతి లో భూములు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ జనం అక్కడ భారీగా భూములను కొనుగోలు చేసారు. 

 

ఇటీవల వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ రాజధాని ఆపేది లేదని కచ్చితంగా విశాఖ వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. దీనితో ఇప్పుడు టాలీవుడ్ లో మళ్ళీ భయం మొదలయింది. ఇన్నాళ్ళు రాజకీయంగా వచ్చే ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గే అవకాశం ఉందని భావించారు అందరూ. కాని అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. ప్రస్తుతం మన తెలుగు లో భూములు కొన్న వాళ్ళు అందరూ కూడా పదుల సంఖ్య లో ఎకరాలను కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇప్పుడు కంగారు పడుతున్నారు. 

 

ఏది ఎలా ఉన్నా ఈ పరిణామం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ సహాయం తో త్రివిక్రమ్... మంత్రి కొడాలి నానీ తో మాట్లాడగా ఆ తర్వాత ఆ భూమికి ఆయన హామీ ఇచ్చారు. కాని లాక్ డౌన్ తో ఆయన భూమిని అమ్మలేదు. ఏది ఎలా ఉన్నా రాజధాని తరలింపు మాత్రం వాళ్లకు కంటి మీద కునుకు ఉంచడం లేదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. మరి రాజధాని ఎప్పుడు మారుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: