ప్రస్తుతం మన తెలుగులో కరోనా కారణంగా సినిమాలు చెయ్యాలి అంటే నిర్మాతలు దర్శకులు హీరోలు అందరూ కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది గాని ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి కనపడటం లేదు. మన తెలుగు హీరోలు ఇప్పుడు సినిమా కథ వినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలు కూడా ఇప్పుడు సినిమాలను చేయడానికి భయపడుతున్నారు. కరోనా ఎప్పుడు తగ్గుతుంది అనేది ఎవరికి తెలియదు. ఈ ప్రభావం తగ్గిన తర్వాత సినిమాలను విడుదల చేస్తారా లేదా అనేది కూడా తెలియదు. 

 

ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, చిరంజీవి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మహేష్ బాబు సినిమా తర్వలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన హీరోల సినిమాలు దాదాపుగా పూర్తి అయిపోయాయి కూడా. ప్రస్తుతం తెలుగులో మార్కెట్ ఎక్కువగా ఉంది. కరోనా ప్రభావం తగ్గకపోతే మాత్రం భారీగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అనేది వాస్తవం. అందుకే ఇప్పుడు హీరోలు వెనక్కు తగ్గుతున్నారు. ఎవరు కథ తీసుకుని వచ్చినా సరే సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అనే టాక్ వినపడుతుంది. 

 

కథ ఏ స్థాయిలో ఉన్నా సరే అసలు వినడం లేదు హీరోలు అని అంటున్నారు. కథ చెప్పడాని కి ఏ నిర్మాత వచ్చినా ఏ దర్శకుడు వచ్చినా సరే ముందుకు రావడం లేదు అని అంటున్నారు. టాలీవుడ్ జనాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. అసలు దీనికి ఇంత భయపడుతున్నారు ఎందుకు అని కూడా ఆలోచన చేస్తున్నారు. దాదాపు రెండేళ్ళ వరకు కూడా సినిమాలకు స్వేచ్చ ఉండే అవకాశం లేదని అనే వాళ్ళు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: