బాలీవుడ్ లో సంచలనాలకు.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రౌనత్.  మీ టూ ఉద్యమంలో యాక్టీవ్ గా పాల్గొంది.. డేటింగ్ గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేసినా.. తనపై సినీ పెద్దలు లైంగిక దాడులు చేశారని రచ్చచేసింది.. ఒక్కటి కాదు ఈ అమ్మడు బాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తుంది.  ఇక ఈమె సోదరి రంగోలీ.. చెల్లె కన్నా పది ఆకులు ఎక్కువే చదివింది. ప్రతి విషయాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ సోషల్ మాద్యమాల్లో నానా హంగామా చేస్తుంది. నిత్యం ఎదో ఒక వివాదం తో నెట్టింట హల్చల్ చేస్తుంటుంది రంగోలి. ఆమధ్య తజ్ మహల్ విషయంలో, ఇటీవల ఫిలిం ఫెర్ అవార్డుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి.  

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రౌనత్ చిక్కుల్లో పడ్డారు. కంగన సోదరి రంగోలీ తాజాగా ఓ మతస్థుల ప్రజలను టార్గెట్ చేసుకొని టెర్రరిస్టులు అంటూ కామెంట్ చేశారు. మొరదాబాద్ లో వైద్యులు పోలీసులపై ఓ వర్గం చేసిన దాడికి సంబంధించిన వీడియోను ఉద్దేశించి రంగోలి పరుషమైన పదాలతో కామెంట్ చేసింది. ఈ కామెంట్లను హీరోయిన్ రంగోలీ సోదరి కంగనా కూడా సమర్ధించింది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమె సోషల్ అకౌంట్ ను కూడా అధికారులు తొలగించారు.

 

తాజాగా కంగనా రౌనత్ ఆమె చెల్లెలు విద్వేష పూరితమైన వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాపిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ అలీ కాపిఫ్ ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్టార్ హీరోయిన్ కంగనా రౌనత్  - సోదరి రంగోలి - ఆమె మేనేజర్ లపై కేసు నమోదు చేశారు.  తాజాగా కంగనా ఆమె సోదరి ఇలా చేసినందుకు క్షమాపణలు చెప్పారు. ఇదివరకే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు కంగనా సోషల్ అకౌంట్ ను రద్దు చేసేసింది. ఇప్పుడు అయినా మరోసారి వ్యాఖ్యానించడం దుమారం రేపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: