నిధి అగ్ర్వాల్ ..అక్కినేని సోదరులు నాగ చైతన్య, అఖిల్ ల తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు యావరేజ్ గా ఆడాయి. దాంతో ఇక నిధి తిరిగి ముంబై కి వెళ్ళిపోవడమే తప్ప ఇంకో ఆప్షన్ లేదనుకున్నారు. దాదాపు ఈ బ్యూటి కూడా ఇదే డిసైడయింది. కాని అనూహ్యంగా పూరి జగన్నాధ్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇది నిజంగా నిధి కి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. రాం హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఇక నిధి కి తిరుగు లేదని అనుకున్నారు. నిధి కూడా మంచి ఫాం లోకి వచ్చానని వరసగా సినిమాలు వచ్చి పడతాయని ఆశపడింది.

 

కాని ఎందుకనో నిధి ఆశలు అలా మిగిలాయంతే. ప్రస్తుతం అఫీషియల్ గా నిధి చేతిలో ఉంది ఒకే ఒక్క సినిమా మాత్రమే. అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న సినిమాలో నిధి హీరోయిన్ గా చేస్తుంది. అది తప్ప ఈ అమ్మడు చేతిలో ఇంకో సినిమాలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత చాలా ప్రాజెక్ట్ లో నిధి నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ సినిమాలో అని, రాం తో మరోసారి నటిస్తుందని సోషల్ మీడియాలో న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. కాని కొన్నాళ్ళకి ఇవన్ని పుకార్లే అని తేలింది.

 

ఇక రీసెంట్ గా కూడా నిధి కి కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయని అంటున్నారు. అందులో ముఖ్యంగా మాస్ మహారాజ రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కబోయో సినిమాలో నిధి కి అవకాశం ఇచ్చారన్న టాక్ నడుస్తుంది. ఈ సినిమాడిసెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళనుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నభా నటేష్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని చెప్పుకుంటున్నారు. అందుకే మరో సారి ఒకే సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీస్ కలిసి నటిస్తున్నరని న్యూస్ వస్తోంది. ఇక ఇప్పటికే నభా నటేష్ రవితేజ తో డిస్కో రాజా లో నటించింది. అందుకే మళ్ళీ రవితేజ ఛాన్స్ ఇచ్చారట. ఇక నిధి మాత్రం ఫస్ట్ టైం రవితేజ తో నటిస్తుంది. అయితే ఇది కేవలం గాసిప్ తప్ప అఫీషియల్ న్యూస్ కాదని అంటున్నారు. ప్రస్తుతానికి ఒక్క సినిమానే చేస్తుందట నిధి అగర్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: