పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పవన్ సరసన తొలిసారిగా అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం అప్పట్లో మంచి హిట్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన బండ్ల గణేష్ తన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు అదిరిపోయే స్క్రీన్ ప్లే, పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే సీన్స్ ని డిజైన్ చేసారు దర్శకుడు హరీష్. 

 

అలానే అప్పట్లో కొన్నేళ్ల నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కు ఆయన ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ ని అందించింది అని చెప్పడం లో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇకపోతే ఆతరువాత వీరిద్దరి కాంబోలో అప్పట్లో మరొక సినిమా రావలసి ఉన్నప్పటికీ అది ఎందుకో కుదరలేదు. అయితే మళ్ళి ఎనిమిదేళ్ల తరువాత అతి త్వరలో వీరిద్దరి క్రేజీ కాంబోలో సినిమా రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న  సినిమా స్క్రిప్ట్ ని ప్రస్తుతం సిద్ధం చేసే పనిలో ఉన్న హరీష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఈ సినిమా కథ, కథనాలు అదిరిపోవడం ఖాయం అని, తప్పకుండా మరొక్కసారి పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా మంచి హిట్ ని అందించడం ఖాయం అని అన్నారు. 

 

వాస్తవానికి తాను పవన్ కళ్యాణ్ ని ఒక దర్శకుడిగా కాకుండా ఒక అభిమానిగా చూస్తూ కథ, డైలాగ్స్ సిద్ధం చేస్తానని, అలానే ఈ సినిమా కథ కూడా ఆయనకు సరిగ్గా సరిపోయేలా డిజైన్ చేసినట్లు చెప్పారు హరీష్. అయితే ఈ కాంబినేషన్ పై ఇటీవల అనౌన్సుమెంట్ రాగానే పవన్ ఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపయింది. తప్పకుండా హరీష్ ఈ సినిమాతో తమ హీరోకు సూపర్ డూపర్ హిట్ ని అందించడం ఖాయం అని, అలానే ఆ సినిమా బద్దలు కొట్టే రికార్డ్స్ కు హద్దు ఉండదని వారు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: