ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో దర్శకులుగా ఎంట్రీ ఇచ్చిన ప్రతీ ఒక్కరు ఒక్కసారైన అమితాబ్ ను డైరెక్ట్ చేయాలకుంటున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ మెగాస్టార్ గా ఉన్న బిగ్ బీని డైరెక్ట్ చేసిన సౌత్ దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్ ఒక్కడు. అయితే మిగతా దర్శకులతో పోల్చుకుంటే పూరి, అమితాబ్ ను చూపించిన విధానమే మేరు. అమితాబ్ హీరోగా పూరి బుడ్డా హోడా తేరా బాప్ సినిమాను రూపొందిచాడు పూరి.
అమితాబ్ ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేస్తున్న సమయం లో ఆయన్నే లీడ్ హీరో గా సినిమాను రూపొందించాడు పూరి. ఈ సినిమాలో అమితాబ్ స్టైల్, యాటిట్యూడ్, యాక్టింగ్ సరికొత్త బిగ్ బీని అభిమానులకు పరిచయం చేసింది. తన వయసుకు తగ్గట్టుగా కనిపిస్తూనే యాంగ్రీ యంగ్ మేన్ యాటిట్యూడ్ ను చూపించిన అమితాబ్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో మరోసారి పూరి అమితాబ్ కాంబినేషన్ లో సినిమా కోసం అమితాబ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
బుడ్డా హోగా తేరా బాప్ సినిమా తరువాత పూరి, అమితాబ్ లు కలిసి మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పారు. పూరి కూడా పలు సందర్భాల్లో అమితాబ్ అవకాశం ఇస్తే బుడ్డా హోగా తేరా బాప్ కు సీక్వెల్ ను తెరకెక్కిస్తానని చెప్పాడు. కానీ తరువాత అమితాబ్ వరుస సినిమాలతో బిజీగా కావటం. పూరి కూడా వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపొయింది. పూరి ప్రస్థుతం విజయ్ దేవర కొండ హీరోగా పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహర్ తో కలిసి పూరి స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.