ఇండియన్ సినిమా హిస్టరీతో ఎన్నో క్లాసిక్స్ ను అందించిన దర్శకుడు మణిరత్నం. మణి తెరకెక్కించిన సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయి ఉండవచ్చుగానీ.. తాను అనుకున్న ఫీల్ అభిమానుల్లో కలిగించటంతో మణి మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అందుకే మణిరత్నం ఇండియన్ సినిమా లెజెండరీ దర్శకుల్లో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఇంత పేరున్న మణిరత్నం తెలుగులో ఒక్క హీరోతో మాత్రమే సినిమా చేశాడు. కథ సెట్ కాకపోవటమో.. తన కథకు తగ్గ హీరోలు తెలుగులో లేకపోవటమో గానీ మణిరత్నం గీతాంజలి తరువాత మరే తెలుగు హీరోతో సినిమా చేయలేదు.
అయితే ఈ లెజెండరీ దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేస్తే సరికొత్త రికార్డులు ఖాయం అని భావిస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ఈ కాంబినేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ కోసం మహేష్ బాబును సంప్రదించాడు మణి. అది చారిత్రక కథ కావటంతో పాటు డేట్స్ భారీగా అవసరం పడటంతో ఈ ప్రాజెక్ట్కు మహేష్ అంగీకరించలేదు. దీంతో క్రేజీ కాంబినేషన్ దాదాపు ఓకె అనుకుంటున్న తరుణంలో క్యాన్సిల్ అయ్యింది. కానీ ఆ కాంబినేషన్ తెర మీదకు వస్తే చూడాలి చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మణి స్టైల్ ఆప్ పోయిటిక్ టేకింగ్కు మహేష్ లాంటి గ్లామరస్ సూపర్ స్టార్ యాడ్ అయితే ఈ సినిమా సరికొత్త రికార్డ్లు సెట్ చేయటం గ్యారెంటీ అని భావిస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం మహేష్ బాబు, మణిరత్నం ఇద్దరు వారి ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లకు పైనే పడుతుంది. ఇక మణిరత్నం కాంబినేషన్లో మహేష్ సినిమా అన్న చర్చ కూడా ఇప్పుడు లేదు. అంటే మణికి మహేష్ తో చేసే ఐడియా మళ్లీ వస్తే తప్ప ఈ కాంబినేషన్ తెర మీదకు వచ్చే ఛాన్సే లేదు.