కరోనా దెబ్బకి కోలీవుడ్, మాలీవుడ్ కూడా శాండల్ వుడ్ కాదేదీ అనర్‌హం. అందుకే ఈ ఇండస్ట్రీస్ లోని సినిమాలన్నీ తెగ వర్రీ అవుతున్నాయి...కేజీయఫ్2 ఇప్పుడు ఈ సినిమా కోసం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు.. ఇండియా అంతటా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సైలెంట్ గా రిలీజ్ అయిన కేజీయఫ్ ఫస్ట్ చాప్టర్ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో సూపర్ సక్సెస్ సాధించింది. యంగ్ స్టార్ యష్ యాక్టింగ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ మెస్మరైజింగ్ చేసింది. ఇక సెకండ్ చాప్టర్ మూవీ అందిరినీ ఊరిస్తుంది. కాని ఈ మూవీ రిలీజ్ పై కారోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది.

 

ఎప్పుడో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన  సెకండ్ చాప్టర్  మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. అయితే ఈ సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల సినిమాను ట్రిపుల్ ఆర్ పాత రిలీజ్ డేట్ జులై 30 కి చే్ద్దాం అనునున్నారు కాని ఆ డేట్ కాస్తా...అక్టోబర్ కు వెళ్లింది.  అయితే ఈ మూవీ కి సంబంధించిన పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరి కరోనా  ఎఫెక్ట్ తో ఇండస్ట్రీ ఎప్పుడు తెరుచుకుంటుందా తెలియని పరిస్థితి. మరి కేజీఎఫ్ అనుకున్న డైట్ కు రిలీజ్ అవుతుందా లేదా చూడాలి.

 

రోబో2.0 దెబ్బలు గట్టిగా తిన్న తరువాత డైరెక్టర్ శకర్, కమల్ హాసన్ తో కలిసి చాలా పట్టుదలతో స్టార్ట్ చేసిన సినిమా భారతీయుడు2 కొన్నేళ్లకిందట వీరి కాంబోలో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు ఇప్పుడు ఆ సినిమాకే సీక్వెల్ చేసి మళ్లీ  ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. కాని ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచీ ఏదో ఒక అవాంతరం ఎదురౌతనే ఉంది. సినిమా నుండి ప్రొడ్యూసర్స్ తప్పుకోవడం.. చిన్న చిన్న కేసులు ఇలా చాలా ఇబ్బంది పడ్డారు మూవీటీమ్.

 

కమల్ హాసన్ ప్రెస్టేజియస్ గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ లో ప్రమాధం జరిగి ముగ్గురు చనిపోయారు.. ఇక దాంతో షూటింగ్ షెడ్యూల్స్ లో చాలా చేంజ్ వచ్చింది. ఇక ఈలోపు కరోనా ఎంటర్ అవ్వడంతో అసలు షూటింగే క్లోజ్ అయ్యింది. దాంతో ఈ మూవీ ఈ ఏడాది రావడం కష్టమనే చెప్పాలి.

 

కోలీవుడ్ లో మణిరత్నం పొన్నియన్ సెల్వంతో పాటు బాలీవుడ్ లో ఇప్పుడు ట్రాక్ పై ఉన్న సినిమాలుకూడా కరోనా వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి. తమిళ, మలయాళ హిందీ నటులతో భారీ స్తాయిలో  ఓ సినిమా ప్లాన్ చేశాడు సీనియర్ డైరెక్టర్ మణిరత్నం. పొన్నియన్ సెల్వమ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ కి రెండు వందల  కోట్లకు పైగా  బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది, అయితే సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూ .. పోతున్న ఈ మూవీకి కరోనా దెబ్బ తగిలింది. అన్ని షూటింగ్ లతో పాటు ఈ మూవీ షూటింగ్ కూడా ఆగిపోవడంతో సినిమా ఎలా కంప్లీట్ చేయాలో తెలియక తలపట్టుకున్నాడు మణిరత్నం.  ఇలా కరోనా ఎవరినీ వదలడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: