ప్రభాస్, చిరంజీవి ఇద్దరూ కూడా ప్యాన్ ఇండియా హీరోలే. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా హై బడ్జెట్ తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ప్రభాస్ తర్వాత నటించిన చిత్రం సాహో కూడా హైలీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం. ఆ చిత్రం కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైంది. దీంతో ప్రభాస్ స్టార్ స్టేటస్ పెరిగిపోయింది. ఇక చిరంజీవి ఇటీవలె నటించిన చిత్రం సైరా ఈ చిత్రం కూడా ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది.
సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ఎక్కువ బడ్జెట్తో తీసిన చిత్రమే. ఇది కూడా దాదాపు అన్ని భాషల్లో విడుదలై హిట్ కొట్టిందనే చెప్పాలి. మరి ఈ ఇద్దరూ ప్యాన్ ఇండియా హీరోలు కనుక కలిసి సినిమా చేస్తే అదుర్స్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఇక వీరిద్దరినీ కలిసి దర్శకత్వం వహించాలంటే రాజమౌళి లేదా కొరటాల శివ చెయ్యాలి. ఎందుకంటే వీరిని ఆ రేంజ్లో చూపించే సత్తా కేవలం వీళ్ళకి మాత్రమే ఉంది. బాలీవుడ్ రేంజ్ స్టోరీ కనుక తీసుకుంటూ ఇద్దరినీ కూడా రెండు రకాల ఇమేజ్లలో చూపించవచ్చు. ఏ ఒక్కరి ఇమేజ్ తగ్గకుండా చేయవచ్చు.
మిర్చి పాయింట్ ఆప్ వ్యూలో ప్రభాస్ని మంచి క్లాస్ లుక్లో అలాగే చిరంజీవిని తీసుకుంటే దేవదాయశాఖలో సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేసే విధంగా ఈ విధమైన కాన్సెప్ట్తో సినిమా చేస్తే ఇక వీరిద్దరి కాంబినేషన్ మీద కూడా ప్రేక్షకులు మంచి ఆశక్తిగా ఉంటారు. ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందంటే కనుక బాలీవుడ్ ఏంటి ఇక దాని రేంజే వేరని చెప్పాలి.