సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియా వాడకం విరివిగా పెరిగిన తర్వాత రోజూ కొత్త కొత్త ఛాలెంజిలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగింది. అందువల్ల ఈ ఛాలెంజిలు మరింతగా పెరిగాయి. కరోనా నేపథ్యంలో సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజితో పాటు పలు రకాల ఛాలెంజిలు కొత్తగా వచ్చి చేరాయి.

 

అయితే ఏ ఛాలెంజి అయినా సెలెబ్రిటీలు స్వీకరిస్తే దానికి మరింత పాపులారిటి వస్తుంది. లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో ఆడవారికి ఇంటి పనుల్లో హెల్ప్ చేయాలన్న ఉద్దేశ్యంతో బీ దరియల్ మ్యాన్ ఛాలెంజి వైరల్ గా మారింది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా ఈ ఛాలెంజిని స్వీకరించి రాజమౌళిని నామినేట్ చేయగా, రాజమౌళి ఆ ఛాలెంజిని కంప్లీట్ చేసి ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి విసిరాడు.

 

అయితే రాజమౌళి విసిరిన ఛాలెంజిని స్వీకరించిన ఎన్టీఆర్, దాన్ని కంప్లీట్ చేసి ఎవ్వరూ ఊహించని విధంగా సీనియర్ హీరోలైన బాలయ్య, చిరంజీవి, నాగర్జున, వెంకటేష్ ల పేర్లని నామినేట్ చేశాడు. అయితే ఎన్టీఆర్ ఛాలెంజిని చిరంజీవి, వెంకటేష్ పూర్తి చేసారు. కానీ బాలయ్య, నాగార్జున మాత్రం ఇప్పటి వరకు ఈ ఛాలెంజిపై స్పందించలేదు. బాలయ్యకి ఎన్టీఆర్ కి మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న ప్రచారం టాలీవుడ్ లో చాలారోజుల నుండి జరుగుతోంది. దానివల్లనే బాలయ్య స్పందించడం లేదేమో అన్న సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. 

 

ఏది ఏమైనా ఈ విషయమై మరికొన్ని రోజులు ఎదురుచూడడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. వెంటనే అనవసర నిర్ణయాలకి పోకుండా కొన్ని రోజులు వేచి చూస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఛాలెంజి స్వీకరించడం, స్వీకరించకపోవడం వ్యక్తిగత విషయమని, దాన్ని ఆసరాగా తీసుకుని అనవసరంగా పుకార్లు సృష్టించవద్దని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: