ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచదేశాల ప్రజలు చిగురుటాకుల వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడమే మార్గాలుగా కనిపిస్తున్నాయి. దీంతో పలు దేశాలు లాక్డౌణ్ విధించాయి. భారత్లోనూ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఓసారి 21 రోజుల పాటులాక్డౌన్ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని19 రోజులు పొడిగిస్తూ.. వచ్చే నెల 3 వరకు పొడిగించారు.
ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు సినిమా నటులు అందరు ఇంటికే పరిమితమయ్యారు. అయితే లాక్డౌన్ వేళ టైగర్ ష్రాఫ్ ఇంట్లో దిశా పటానీ ఉంటున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి భాగీ 2 సినిమాలో కలిసి నటించిన హాట్ కపుల్ టైగర్ ష్రాఫ్, దిశా పటానిల మధ్య అప్పటి నుంచి ఏదో ఉందన్న టాక్ బాలీవుడ్ మీడియాలో తరుచూ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను వారు ఖండించినా తరుచూ ప్రైవేట్ పార్టీలో కలిసి కనిపించటంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏకంగా వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి.
దీనిపై టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ క్లారిటి ఇచ్చింది. దిషా పటానీ మా ఇంట్లో లేదు.. మా ఇంటికి దగ్గర్లో ఉంది. అప్పుడప్పుడు మేము బయటకు వెళ్లి నిత్యావసర సరకులు తెచ్చుకుంటాము.. మా ముగ్గురికి ఫిట్నెస్ అంటే ఇష్టం.. అందుకే మంచి స్నేహితులమయ్యామని చెప్పుకొచ్చింది. అలాగే దిశా పటాని, టైగర్ మధ్య సన్నిహిత్యం గురించి మాట్లాడుతూ.. దిశా, టైగర్ మంచి స్నేహితులని, దిశాతో తమ కుటుంబమంతా బాగా కనెక్ట్ అయ్యామని తెలిపారు. అన్నయ్య టైగర్.. దిశాతో ఎక్కువ సమయం గడపడుపుతుంటే ఆమె మంచి అమ్మాయి అని అర్థమైందని, అన్నయ్యను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతోందని చెప్పుకొచ్చింది.