టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా విదేశాలకు వెళ్లి హాయిగా తమ సమయాన్ని గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు కానీ కరోనా వైరస్ వ్యాప్తి మనదేశంలో అప్పటికే తీవ్ర స్థాయిలో ఉండడంతో కేంద్ర సర్కార్ లాక్ డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో మహేష్ బాబు ఇంటికే పరిమితమై తన కొడుకుతో గేమ్స్ ఆడుకుంటున్నాడు. అలాగే తన తదుపరి చిత్రం కోసమని సరికొత్త స్క్రిప్ట్ లను వింటున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తీయనున్న చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు అనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.


వాస్తవానికి తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పటినుండో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని కోరుకుంటున్నారు. రాజమౌళి ఇప్పటివరకు కేవలం 11 సినిమాలు మాత్రమే తెరకెక్కించాడు. ఆర్ఆర్ఆర్ ఒకవేళ విడుదల అయితే అది తన 12వ సినిమా అవుతుంది. ఈ 12 చిత్రాలలో దాదాపుగా కమర్షియల్, సోషల్, సోషియో ఫాంటసీ, క్రైమ్, అడ్వెంచర్ ఇలాంటి ఎన్నో రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు చారిత్రాత్మక రాజుల సినిమాకు ఎలాగో సెట్ కాడు కాబట్టి బాహుబలి వంటి చిత్రం తన తో కలిసి తీసేందుకు రాజమౌళి సాహసించడు.


మహేష్ బాబు చేయగలిగింది ఏదైనా ఉందంటే అది కేవలం కమర్షియల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం వస్తున్న వార్తలు కూడా రాజమౌళి మహేష్ బాబు తో కలిసి ఒక కమర్షియల్ మూవీ మాత్రమే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కొంతమంది సినీ వర్గాల వారు థ్రిల్లర్ జోనర్ లోని ఒక అరుదైన కథాంశంతో రాజమౌళి తన తండ్రితో స్క్రిప్ట్ రాయిస్తున్నాడని టాక్. ఏదేమైనా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి సర్వత్ర ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: