ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చాలామంది జీవితాలు అతలాకుతలం అవుతున్నాయనే చెప్పాలి. కరోనా వైరస్ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది. దీనితో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు రాజకీయాల వరకు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక మరోవైపు సినీ ఇండస్ట్రీలో అన్ని షూటింగులు ఆగిపోవడంతో సెలబ్రిటీస్ తారలంతా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో వాళ్ల సమయాన్ని సరదాగా గడుపుతున్నారని చెప్పాలి. అంతేకాకుండా సినీ తారలు ఇంటిని శుభ్రం చేస్తూ, వంటకాలు చేస్తూ వారి పాత జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను కుష్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన రోజువారీ షెడ్యూల్ అభిమానులతో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ లాక్ డౌన్ సమయంలో తనలో వచ్చిన మార్పులను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేయడం జరిగింది.

 

అసలు విషయానికి వస్తే.. పోస్టులో రకుల్ ప్రీత్ ఏమి తెలిపింది అంటే... నా షూటింగ్ మార్చి 18న ముగిసింది. అప్పటి నుంచి ఇంట్లోనే సినిమాలు. ఇక లాక్ డౌన్ ముగింపు పలికే సరికి బద్ధకం ఏర్పడకూడదు అని నేను ఒక షెడ్యూల్ తయారుచేసుకున్నాను అంటూ తెలిపింది. రోజువారీ షెడ్యూల్ ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో నిద్ర లేవడం జరుగుతుంది. తర్వాత కొద్దిసేపు చదువుకుంటాను. ఇక మధ్యాహ్నం కొద్దిగా సమయం సోషల్ మీడియాలో గడుపుతాను. అలాగే గత రెండు సంవత్సరాలుగా ఆస్కార్ అవార్డు సాధించిన సినిమాలను చూశాను. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం ఏదైనా షోకు సంబంధించి రెండు మూడు ఎపిసోడ్లను వీక్షిస్తున్నాను అంటూ రకుల్ తెలియజేసింది. 

 


అలాగే ఇందులో ఇటీవల మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించానని తెలిపింది. ప్రస్తుతం నాతోపాటు ముంబైలో నా సోదరుడు కూడా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. అలాగే నా జీవితంలో ఎన్నడూ ఇలా చాలా రోజులు ఇంట్లో ఉండలేదు. చిన్నప్పుడు వేసవి కాలం సెలవుల్లో కూడా ఇన్ని రోజులు గడపలేదు అని ఆత్మపరిశీలన చేసుకునే సమయం అంటూ... ప్రస్తుతం మాత్రం నేను ఎక్కువగా పర్సనల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నాను ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అని తెలియజేసింది. ఇక చివరగా ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారి నుంచి అతి త్వరలోనే బయటపడాలని.. అందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటూ సుదీర్ఘ పోస్ట్ రకుల్ ప్రీత్ సింగ్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: