టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. దశాబ్దాల కాలం తర్వాత మల్టీస్టారర్ ట్రెండ్ కు నాంది పలికారు వెంకటేష్, మహేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగులో మల్టీస్టారర్ తో కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. ఇక ఆ సినిమా నుండి మళ్ళీ వరుసగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో రాబోయే మల్టీస్టారర్ సినిమాల మీద చర్చలు జరుగుతున్నాయి. వెంకటేష్ తో పవర్ స్టార్ గోపాల గోపాల సీక్వల్ గా మరో సినిమా వస్తుందని తెలుస్తుంది. 


వెంకటేష్ తోనే కాదు మహేష్, ఎన్టీఆర్ లతో కూడా పవర్ స్టార్ సినిమా చేస్తే చూడాలని ఉత్సాహంగా ఉన్నారు సినీ ప్రియులు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్, పవర్ స్టార్ మల్టీస్టారర్ వస్తే చూడాలని ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సుబ్బిరామి రెడ్డి ఎప్పుడో చిరు, పవన్ ల మల్టీస్టారర్ సినిమా ఉంటుందని త్రివిక్రమ్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తాడని ఎనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. 


ఇక పవర్ స్టార్ తో చిరంజీవి మాత్రమే కాదు మహేష్, ఎన్టీఆర్ లు కూడా కలిసి చేస్తే ఎలా ఉంటుందో.. అబ్బో ఆలోచనే అదిరిపోయింది కదా.. నిజంగా ఈ కాంబో జరిగితే ముగ్గురు హీరోల ఫ్యాన్స్ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఎవరి స్టామినాకు తగినట్టుగా ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తే మాత్రం బొమ్మ  దద్దరిల్లిపోవడం ఖాయం. టాలీవుడ్ ముగ్గురు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. కానీ ఇది జరగడం కష్టమే అని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటించే మల్టీస్టారర్ కోసం మాత్రం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.           

 

మరింత సమాచారం తెలుసుకోండి: