స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగా ఫ్యాన్స్ ను ఎంతైనా ఎక్స్ టెన్షన్స్ పెట్టుకో అంటున్నాడు. అయితే ఒక్క విషయం మాత్రం తన చేతిలో లేదని నిరాశపరుస్తున్నాడు. మెగాస్టార్ ను నెవర్ బిఫోర్ క్యారెక్టర్ ప్రజెంట్ చేయబోతున్న కొరటాల చేతులెత్తేయడం డైలమాలో పడేస్తోంది. 

 

రచయితగా కెరీర్ స్టార్ చేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. వరుసగా హిట్స్ తో టాలీవుడ్ లో వన్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. సోషల్ మెసేజ్ పాయింట్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేయడంలో కొరటాల టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రతిహీరోకు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తున్న ఈ దర్శకుడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవితో చేస్తున్న సినిమాకు సంబంధించి కొరటాల శివ చెబుతున్న విషయాలను ఫ్యాన్స్ లో ఆనందంతో పాటు కాస్త నిరాశపరుస్తున్నాయి. 

 

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. నిజానికి లాక్ డౌన్ విధించక ముందే చిరంజీవి సూచన మేరకు ఈ చిత్ర షూటింగ్ ఆపేశారు. ఈ చిత్రానికి సంబంధించి రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొరటాల శివ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పడం విశేషం. ఆచార్య సినిమాకు సంబంధించి ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఈ సినిమా ఇంకాస్త ముందే కంప్లీట్ అయ్యేదట. కానీ మెగాస్టార్ సైరా సినిమాతో బిజీగా ఉండటంతో ఆచార్య లేట్ గా స్టార్ అయినట్టు కొరటాల చెబుతున్నాడు. 

 

లాక్ డౌన్ తర్వాత ఆచార్య సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తానని కొరటాల చెబుతున్నాడు. అయితే చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేస్తామా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమంటున్నాడు. ఇక ఆచార్యలో మెగాస్టార్ పాత్రపై ఫ్యాన్స్ ఎంతైనా హోప్స్ పెట్టుకోవచ్చని.. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందన్న కొరటాల మాటలతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ పవర్ ఫుల్ రోల్ క్రియేట్ చేశాడట. మెసేజ్ తో పాటు మాస్ ఎలిమెంట్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: