పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా కి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. హిందీలో 23 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన పింక్ 100 కోట్ల పైనే వసూళ్ళని రాబట్టింది. ఇక ఇదే సినిమాని కోలీవుడ్ లో బోని కపూర్ అజిత్ హీరోగా నిర్మించారు. అక్కడ కూడా దాదాపు 200 కోట్ల వరకు వసూళ్ళు సాధించింది. తమిళ వెర్షన్ లోను మాతృకలో ఉన్నట్టుగానే పెద్దగా మార్పులు చేయకుండా నిర్మించారు. ఇక అమితాబ్ లాగా అజిత్ కూడా అద్భుతంగా నటించాడు. అందుకే ఈ సినిమా కోలీవుడ్ లోను సూపర్ హిట్ గా నిలిచింది.

 

దాంతో ఈ సినిమాని బోనీకపూర్ తెలుగులో మళ్ళీ నిర్మించాలనుకున్నారు. అందుకే దిల్ రాజు తో కలిసి వకీల్ సాబ్ ని నిర్మిస్తున్నారు. అయితే  హిందీ తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్లో 26వ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ అంతటి గొప్ప పాత్ర నివేదా థామస్ అని తెలిసిందే. హిందీలో ఈ పాత్ర ని తాప్సీ పోషించింది. అయితే హిందీ కంటే కూడా తెలుగులో ఈ పాత్ర ఇంకా బలంగా ఉంటుందట.

 

ఇక ఈ సినిమా తో పాటు నివేదా థామస్ మరో సినిమాలో నటిస్తుంది. అదే నాని వి సినిమా. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కి జంటగా నటిస్తుంది. అదితీ రావ్ హైదరీ నాని కి జంటగా నటిస్తుంది. ఇక వకీల్ సాబ్, వి సినిమాలకి దిల్ రాజు నిర్మాత. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు మంచి సినిమాలైనప్పటికి కరోనా కారణంగా ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. అందుకే నివేదా థామస్ కి బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నప్పటికి నెత్తిమీద బ్యాడ్ టైం ఉందిగా అన్నట్టు చెప్పుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: