రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఫాం లోకి వచ్చాడు. చాలాకాలంగా ఎదురుచుస్తున్న సక్సస్ ని ఈ సినిమా ఇచ్చింది. అంతేకాదు రామ్ కెరీర్ లో ఇప్పటి వరకు ఈ రేంజ్ మాస్ హిట్ గాని మాస్ ఇమేజ్ గాని తీసుకు వచ్చిన సినిమాలేదనే చెప్పాలి. ఆ లోటులన్నిటిని ఇస్మార్ట్ శంకర్ సినిమా తీర్చేసింది. దాంతో రామ్ మరోసారి మాస్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన తడం సినిమాని తెలుగులో రెడ్ అన్న టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి రామ్ ఇమేక్ కి తగ్గట్టు రూపొందిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.

 

కాని కరోనా ఎఫెక్ట్ తో ఆ డేట్ కి సినిమాని రిలీజ్ చేస్తారన్న నమ్మకం లేదట. "ఇస్మార్ట్ శంకర్" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత రామ్ నటిస్తోన్న సినిమా కి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా... హెబ్బా పటేల్ గెస్ట్ అపీరీయన్స్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్‌ చేస్తోంది. కరోనా ప్రభావం తగ్గి థియేటర్లు ఓపెన్ అయితే జూన్ మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నప్పటికి రామ్ తో పాటు మేకర్స్ కూడా డైలమాలో పడ్డారట. ఇప్పుడు సినిమాని రిలీజ్ చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుందా అని ఆలోచనలో పడ్డారట. ఒక రకంగా రామ్ కి ఇది పెద్ద దెబ్బ అని అంటున్నారు.

 

అందుకే ఓటిటి ప్లాట్ ఫాం లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అమోజాన్ ప్రైం లో డిరెక్ట్ గా రిలీజ్ చేద్దామని చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి 35 కోట్ల వరకు ఆఫర్ కూడా వచ్చినట్టు సమాచారం. అయితే ఇదే సినిమా గనక థియోటర్స్ లో రిలీజ్ చేస్తే భారీగా లాభాలొస్తాయన్న ఆలోచన వల్ల ఇంకా ఏమీ నిర్ణయానికి రాలేకపోతున్నారట. సినిమా గనక హిట్ అన్న టాక్ వస్తే శాటిలైట్ బిజినెస్ గాని, వసూళ్ళు గాని భారీగా వచ్చే అవకాశాలుంటాయి. అందుకే రెడ్ సినిమా విషయం లో ఏమీ తేల్చుకోలేకపోతున్నారట. పాపం రామ్ కి మాములు షాక్ కాదు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: