టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రేష్మీ. పెద్ద పెద్ద షోస్ చేయడమే కాదు తనకంటూ యాంకర్ గా ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది ఆమె. వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. ఆమె ఇప్పుడు జబర్దస్త్ తో పాటుగా పలు టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనపడుతుంది. అయితే అసలు ఆమె టాలీవుడ్ కి రావడానికి ప్రధాన కారణం సినిమాలు అని సమాచారం. సినిమాల్లోకి రావాలని ఆమె భావించి ఆ తర్వాత యాంకర్ గా అడుగు పెట్టింది అంటారు. సినిమాల కోసం అని ఆమె తనకు సన్నిహితంగా ఉండే ఒక నటి ద్వారా ప్రయత్నాలు చేసింది. 

 

చిన్న చిన్న సినిమాలకు హీరోయిన్ లేదా హీరోయిన్ ఫ్రెండ్ వేషాలు వేద్దామని టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ముందు హీరోయిన్ గా ప్రయత్నాలు చెయ్యాలి అనుకుంది గాని అవి అంతగా ఫలించాలేదని అందుకే ఆమె సినిమాలను పక్కన పెట్టి తనకు బుల్లి తెర మీద బాగా పరిచయం ఉన్న ఒక యాంకర్ ద్వారా ప్రయత్నాలు చేసి తర్వాత యాంకర్ గా అడుగు పెట్టింది అంటారు. టాలీవుడ్ లో కొందరు పెద్దల ఆశీర్వాదం ఆమెకు లేదని అందుకే ఆమె సినిమాల్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. 

 

ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి కొందరు ముందుకు రాలేదు అంటారు. టాలీవుడ్ జనం ఎక్కువగా ఏదోక అవకాశం కోసం చూస్తూ ఉంటారని అందులో రేష్మీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందని కెరీర్ మొదట్లో కనీసం అద్దె కట్టే పరిస్థితి కూడా ఆమెకు లేదు అని అంటారు. అది ఎంత వరకు నిజమో గాని ఆమె ఆర్ధికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడిందని ఆఫర్ల కోసం చాలా మందికి డబ్బులు ఇచ్చింది అని అంటారు. ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితికి ఆమె వెళ్లిందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: