రంగస్థలం వచ్చిన రెండేళ్లకి గాని సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్దామనుకునే లోపే కరోనా కారణంగా షూటింగ్ స్టార్ట్ కాకుండా పోయింది. అయితే సుకుమార్ ఈ సినిమాని మొదటగా తెలుగు వారికోసమే తీద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ బన్నీ అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

అయితే ప్రస్తుతం ఈ ప్లానింగే సుకుమార్ కి పెద్ద ఇబ్బందికి గురిచేస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నాడు. నెగెటివ్ షేడ్స్ లో కనిపించే ఈ పాత్ర చేయడానికి మొదటగా విజయ్ ఒప్పుకున్నప్పటికీ, పాన్ ఇండియా రేంజ్ అనేసరికి వెనక్కి తగ్గుతున్నాడు. హీరోగా విజయ్ కి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది.

 

అలాంటిది పాన్ ఇండియా సినిమాలో విలన్ గా కనిపించడం వల్ల తమిళంలో ఆయన కెరీర్ కి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో నటించనని చెప్తున్నాడు. అయితే సుకుమార్ ఈ పాత్ర కోసం తమిళ నటులైతే బాగుంటుందని చూస్తున్నాడట. విజయ్ సేతుపతి తప్పుకుంటే ఆ స్థానంలో ఎవరిని తీసుకురావాలో అర్థం కావట్లేదట. కన్నడ నటుడు ధనుంజయని పరిశీలిస్తున్నప్పటికీ, ఎందుకో అంత సంతృప్తికరంగా లేడట. 

 

అయితే విజయ్ సేతుపతి అంతలా కాకపోయినా తమిళంలో బాగా క్రేజ్ ఉన్న వారిలో బాబీ సింహా కూడా ఒకరు. నేషనల్ అవార్డు విజేత అయిన బాబీ సింహాని ఈ పాత్రలో నటింపజేయాలని అనుకుంటున్నారట. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాబీ సింహా చక్కగా సరిపోతాడని అభిప్రాయపడుతున్నారు. అదీగాక బాబీ సింహా తమిళ సినిమాల్లో నటించినప్పటికీ, అచ్చమైన తెలుగువాడే. డబ్బింగ్ పరంగానూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి సుకుమార్ బాబీ సింహాని ఫైనల్ చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: