మన తెలుగులో హీరోయిన్ ల కొరత ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. చిన్న సినిమాల హీరోయిన్స్ ని కూడా ఇప్పుడు వెతకలేక దర్శక నిర్మాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కాలంలో అగ్ర హీరోల పక్కన చేసే హీరోయిన్ ల కోసం మన వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చిన్న చిన్న సన్నివేశాలకు కూడా హీరోయిన్ లు సరైన వాళ్ళు దొరకడం లేదు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది ఇప్పుడు. ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న వాళ్ళల్లో పూజ హెగ్డే, రష్మిక మందన ఒకరు. 

 

వీరికి మన తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అగ్ర దర్శకులు హీరోలు నిర్మాతలు వీరిని తమ సినిమాల్లో తీసుకోవడానికి గానూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం మన తెలుగులో వీళ్ళు మినహా మరో ఆప్షన్ అనేది దర్శక నిర్మాతలకు అసలు కనపడటం లేదు అనే విషయం అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ వెంట అగ్ర హీరోలు పడుతున్నారని వార్తల వస్తున్నాయి. ఆమెకు గ్లామర్ తో పాటు నటన కూడా ఎక్కువగానే ఉంటుంది. కీర్తి సురేష్ నటనకు అభిమానులు కూడా ఉన్నారు. 

 

ఆమె స్కిన్ షో చేయకపోయినా సరే ఆమె తో సినిమా చేయడానికి ముందుకువస్తున్నారు. ఆమెకు ఈ మధ్య కాలంలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. మహేష్ బాబు నేరుగా ఆమెకు ఫోన్ చేసి అడిగారు అని టాక్. అలాగే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆమెను చెయ్యాలని అడిగారు అని అంటున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఆమెకు ఆఫర్ చేసారు అని కూడా అంటున్నారు. ఆమె ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమాల తర్వాత తెలుగులో రెండు సినిమాలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: