సినిమా ఇండస్ట్రీలో అవసరార్ధం సినిమాలు , రాజకీయాలకు వాడుకోవటం లాంటివి ఉంటాయని వాటిని స్వయంగా అనుభవించిన వారు చెబుతుంటారు. కొన్ని కొన్ని సార్లు అవి స్వచ్ఛమైన నిజాలు కూడా  అవుతాయి. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఇటీవల  ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ను మొదల పెడుతున్నట్లు  చెప్పాడు. అది కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబు తో ఉంటుందని చెప్పడంతో మహేష్ బాబు గతంలో ఒప్పుకున్న మరియు తీయాలనుకున్న సినిమాలన్నీ పక్కన పెట్టేశాడు.  అసలైతే మహర్షి మూవీ తో  సెన్సేషనల్   హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో మరో సినిమాని ప్లాన్ చేసాడు మహేష్ బాబు.

IHG

 

అయితే ఆ సినిమాను సరిలేరు నీకెవ్వరు తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకున్నాడు మహేష్ బాబు కానీ రాజమౌళి చేసిన అనౌన్స్మెంట్ కారణంగా వంశీ పైడిపల్లి స్టోరీ నచ్చలేదని దానిని కొద్దిగా మార్పులు చేర్పులు చేయమని తిరిగి పంపించేశాడు. అయితే ఈసారి మంచి కథతో రావాల్సిందిగా వంశీ పైడిపల్లి ని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న  లాక్ డౌన్ తర్వాత గీత గోవిందం డైరెక్టర్ పరశురాం తో మహేష్ బాబు ఓ సినిమాకి ఓకే చెప్పాడు. లాక్ డౌన్ తర్వాత ఇదే సెట్స్ మీదకి వెళ్లనుంది.  ఎలాగో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా వచ్చే సంక్రాంతి కల్లా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈలోపులో పరశురాం సినిమాను పూర్తిచేయాలని మహేష్ బాబు అనుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత పక్కాగా రాజమౌళి తోనే సినిమా చేయడానికి మహేష్ కళ్లు కాయలు కాచేలాగా వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు కాబోలు .

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: