మన తెలుగు హీరోలకు వ్యాపారం మీద ఏ స్థాయిలో ఆసక్తి ఉందో అందరికి తెలిసిందే. రాజకీయ పరిచయాలు ఉన్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు వ్యాపారం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. టాలీవుడ్ లో చిన్న చిన్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు వ్యాపారం మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. నష్టాలు లేని వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. టాలీవుడ్ జనాలకు ఆ విధంగా డబ్బు మీద మమకారం పెరిగింది. సినిమాల్లో వచ్చేది ఎక్కువ భాగం వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. 

 

టాలీవుడ్ లో మంచి మంచి నిర్మాతలు కూడా ఇప్పుడు హీరోలతో వ్యాపారం చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తున్నారు. పది నుంచి వంద కోట్ల వరకు చిన్న చిన్న రంగాల నుంచి పెద్ద పెద్ద రంగాల వరకు పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నారు మన హీరోలు. ఇక ఇప్పుడు కొందరు హీరోలు రాజకీయ నాయకులతో కలిసి ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలంగాణా మంత్రులు, ఎంపీలు  ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారితో టాలీవుడ్ టాప్ హీరో కి మంచి పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఆయన తో కలిసి అదే జిల్లాలో మంచి భూములను కొనుగోలు చేస్తున్నారని వాటి లో గత అయిదేళ్ళు గా మంచి లాభాలను సదరు హీరో గారు సంపాదించారు అని అంటున్నారు. ఇప్పుడు ఆ వ్యాపారాల మీద ఎక్కువగా ఆయన ఫోకస్ చేసారు అని అంటున్నారు. గత అయిదేళ్ళు గా ఆయన ఆ రంగంలో లాభాలు లాగడం చూసి మరికొందరు హీరోలు కూడా అక్కడ పెట్టుబదులు పెట్టే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అగ్ర హీరోలు కూడా ఇప్పుడు ఆ రంగం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: