టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంతా. వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది సమంతా. సీనియర్ హీరోయిన్ అయినా సరే ఇప్పటికి ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తూనే ఉంటారు. ఆమె సినిమా చేస్తే హిట్ అనే భావన కూడా ఉండేది అప్పట్లో. ఆ విధంగా ఆమె దూసుకుపోయింది. టాలీవుడ్ లో మంచి క్రేజ్ తో పాటుగా ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకున్న హీరోయిన్ సమంతా. ఇక ఇప్పుడు ఈ భామ వ్యాపార రంగం మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది, 

 

అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వ్యాపార రంగం మీద ఆమెకు ఆసక్తి ఎక్కువగా ఉంటుందని అందుకే అక్కడ పెట్టుబడులు పెట్టాలని చూస్తుంది అంటున్నారు. కేరళ తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలలో హోటల్స్  బిజినెస్ మీద ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తన మావగారు నాగార్జున తో కలిసి ఆమె ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వినపడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే భర్త నాగ చైతన్య తో కలిసి ఆమె చర్చలు కూడా జరిపిందని ఫ్యామిలీ నుంచి మద్దతు వచ్చింది అంటున్నారు. 

 

టాలీవుడ్ లో తనకు ఉన్న క్రేజ్ ని ఆమె ఈ విధంగా కూడా వాడుకోవాలని దీనికి సంబంధించి ప్రచారం ఎక్కువగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆమె భావిస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె ఈ రంగంలో దాదాపు వంద కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఆలోచన లో ఉంది అనేది టాలీవుడ్ లో వినపడుతున్న మాట. మరి ఎంత వరకు పెట్టుబడి పెడుతుందో ఎం చేస్తుందో అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: