అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. పుష్పరాజ్ అనే పేరుతో ఈ సినిమాలో బన్నీని పిలుస్తారట. అందుకే ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమ నుండి రోజుకో వార్త వస్తుంది.

 

పుష్పలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం విజయ్ సేతుపతిసినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండడం వల్లనే విజయ్ సేతుపతిసినిమా నుండి తప్పుకున్నట్లు చెప్పారు. అయితే పుష్పలో రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా ఉందని ప్రచారం సాగింది. సెకండ్ హీరోయిన్ గా జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన నివేధా థామస్ ని తీసుకున్నరాని అన్నారు.

 

ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రే లేదని అంటున్నారు. సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఒక్కరే ఉంటారని అంటున్నారు. నివేధా థామస్ గురించిన వార్తలన్నీ పుకార్లేనని చెబుతున్నారు. సోలో హీరోయిన్ అయిన రష్మిక పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉండనుందట.

 

రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న పుష్పలో బన్నీ, రష్మిక భార్యాభర్తలుగా కనిపించనున్నారట. వారిద్దరి మధ్య సాగే సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయట. ముఖ్యంగా చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడడం అందరికీ కొత్తగా ఉంటుందట. సెపరేట్ గా లవ్ ట్రాక్ ఏమీ ఉండదని, భార్యాభర్తలుగా బన్నీ, రష్మిక రొమాన్స్ బాగుంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: