లాక్ డౌన్ పిరియడ్ కావడంతో సెలెబ్రెటీలు అంతా తమ ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితులలో అనేకమంది హీరోలు తమ పిల్లలతో తాము గడుపుతున్న సమయానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మాస్ హీరో రవితేజ కూడ తన  హోమ్ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.


వాస్తవానికి రవితేజ ఎప్పుడు తన వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన వార్తలను ఫోటోలను బయటకు లీక్ చేయడానికి అంతగా ఇష్టపడడు. అయితే ఈ లాక్ డౌన్ రవితేజ అభిప్రాయాలను కూడ మార్చేసింది.  ప్రస్తుతం మాస్ మహారాజ తన కొడుకుతో ఉన్న ఒక ఫోటోను తన అభిమానుల కోసం షేర్ చేసాడు. 


ఈఫోటోలో రవితేజ తన కొడుకు మహాధన్ ఒకే మంచం పై రిలాక్స్ గా ఉండి ఎవరి సెల్స్ లో వాళ్ళు వాళ్లకు నచ్చిన విషయాలను ఆ సెల్స్ లో చూసుకుంటున్నారు. అయితే తనకన్నా తన కొడుకు అతడి సెల్ లో ఏకాగ్రతతో తదేకంగా చూస్తున్న ఆ ఫోటో ఏమిటి అంటూ రవితేజ ఓర కంటితో తన కొడుకు వైపు చేస్తున్నా మహాధన్ పట్టించుకోవడంలేదు.


ఈ ఫోటోను మాస్ మహారాజ అభిమానులు మాత్రం మహాధన్ పెద్దవాడు అయిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఇక అతడు రవితేజ చెప్పుచేతలలో ఉండే రోజులు ఇక ఎక్కువగా లేవు అంటూ జోక్ చేస్తున్నారు. మహాధన్ ‘రాజా ది గ్రేట్’ మూవీలో నటించి మెప్పించాడు. అయితే అతడికి సినిమాల పై కన్నా అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కోరిక ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం తన దృష్టిని అంతా చదువు పై పెడుతున్నాడు అంటూ ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రవితేజ వరస ఫ్లాప్ లు మీద కొనసాగుతున్న పరిస్థితులలో లేటెస్ట్ గా నటిస్తున్న గోపీ చంద్ మలినేని ‘క్రాక్’ అయినా హిట్ అయి తన పరాజయాల యాత్రకు బ్రేక్ పడుతుంది అన్న ఆశతో ఉన్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: