టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క. టాలీవుడ్ లో ఆమె అడుగు పెట్టి పదేళ్ళు దాటేసినా సరే ఆమె మాత్రం దూకుడుగా సినిమాలు చేస్తూనే ఉంది. యువ హీరోయిన్ లకు ఎక్కువగా పోటీ ఇస్తుంది ఆమె. వరుస సినిమాలతో ఈ మధ్య కాలంలో అనుష్క చాలా బిజీ గా ఉంటుంది. వయసు మీద పడినా సరే ఎక్కడా కూడా అందం తగ్గకుండా, ఫిట్నెస్ పోకుండా జాగ్రత్తలు పడుతుంది అనుష్క. ఇప్పటికి చాలా మంది హీరోల పక్కన ఈమె మొదటి ఆప్షన్. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈమె వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందట.

 

ప్రస్తుతం ఆమె రియాల్ ఎస్టేట్ రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆ రంగంలో ఎక్కువగా ఆమె పెట్టుబడులు పెట్టాలి అని చూస్తుంది అంటున్నారు. అనుష్క ఇప్పటికే అమరావతి విశాఖ సహా పలు ప్రాంతాల్లో భారీగా భోములను కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో భూములను మంచి లాభాలకే ఆమె అమ్మేసిందని అంటున్నారు. అమరావతిలో భూములు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని హైదరాబాద్ లో పలు విల్లాలను ఆమె కొనుగోలు చేసి విక్రయించింది అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆమె ఈ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెడితే దీర్ఘ కాలిక లాభాలు ఉంటాయని భావిస్తుంది. చిన్న చిన్న పెట్టుబడుల నుంచి భారీ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తుంది అనుష్క. ఆమెకు ముందు నష్టాలు వచ్చినా సరే తర్వాత మాత్రం దూకుడుగానే వ్యాపారం చేయడం మొదలు పెట్టి నష్టాల నుంచి బయటకు వచ్చిందని ఇప్పుడు భారీగా ఆ రంగంలో ఆమె పెట్టుబడులు పెట్టింది అంటున్నారు. ఇక అమెరికాలో కూడా ఆమె రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. తన సన్నిహితుల ద్వారా ఆమె అక్కడ పెట్టుబడులు పెట్టింది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: