జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి ౮వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నానని ప్రకటించాడు. అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురములో చిత్రం తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఇదే.

 


త్రివిక్రమ్ మొదటిసారిగా పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ వస్తున్న కారణంగా త్రివిక్రమ్ ఈ సినిమాని పాన్ ఇండియా ప్రేక్షకులకి తగినట్లుగా తీర్చిదిద్దుతున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంతవరకూ కన్ఫర్మ్ చేయలేదు. పూజాహెగ్డే పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం.

 


అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడట. అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్ లాగే ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడట. త్రివిక్రమ్ సినిమాల్లో స్టార్ క్యాస్టింగ్ ఎక్కువగా ఉంటున్న మాట నిజం. గత రెండు మూడు సినిమాల నుండి పరిశీలిస్తే, చిన్న చిన్న క్యారెక్టర్లని కూడా పేరుగల హీరోహీరోయిన్లనే తీసుకుంటున్నాడు. అరవింద సమేత సినిమాలో ఈషారెబ్బ, అల వైకుంఠపురములో నివేతా పేతురాజ్ లని కూడా అలాగే తీసుకున్నాడు.

 

అలాగే ఎన్టీఆర్ తో చేసే సినిమాలోనూ మరో యంగ్ హీరో కనిపించనున్నాడట. అయితే మరో హీరో సినిమాలో కనిపిస్తున్నప్పటికీ ఆ పాత్రకి అంత ప్రాధాన్యం ఉండనుందా లేదా అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్ పాత్రలాగే ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ తో పాటు మరో నిర్మాణ సంస్థ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: