ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది అనే చెప్పాలి. అంతేకాకుండా స్టార్ హీరోలకు కూడా చాలా ప్రభావం పడుతుంది అని చెప్పవచ్చు. యంగ్ హీరో నితిన్ పై ఈ మహమ్మారి ప్రభావం బాగానే పడింది. వాస్తవానికి భీష్మ సినిమా విజయం సాధించన నితిన్ ఏప్రిల్ నెలలో తన ప్రేమికురాలితో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యాడు. కరోనా వైరస్ ప్రభావం లేకపోయి ఉంటే ఇప్పటికే నితిన్ ఒక ఇంటి వాడు అయ్యే వాడే అనే చెప్పాలి. కానీ ఇంతలోనే కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో అన్ని పెళ్లిళ్లు వాయిదా పడటంతో పాటు మన జీవితాలను అతలాకుతలం అవుతోంది. దీని ప్రభావంతో హీరో నితిన్ పెళ్లి కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. 


హీరో నితిన్ గత కొన్ని సంవత్సరాలుగా షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ఇటీవలే ఇద్దరి పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు యంగ్ హీరో వెంకీ అట్లూరి దర్శకత్వంలో " రంగ్ దే " అనే సినిమాలో హీరోగా వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న రీమేక్ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో " ఆయుష్మాన్ పురాణ " హీరోగా వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటించడం జరిగింది.

ఈ పాత్ర కోసం మన తెలుగు ఇండస్ట్రీలో అనసూయ లేదా రమ్యకృష్ణ పేర్లు పరిశీలిస్తున్న మొదలుపెట్టారు. హీరోయిన్ పాత్ర విషయానికి వస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. గతంలో నానితో " గ్యాంగ్ లీడర్ " సినిమాలో ప్రియాంక అరుల్ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే చెప్పాలి. అంతే కాకుండా తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. పద్ధతి గా నటిస్తూనే, మరోపక్క ఈ బ్యూటీ లుక్స్ యువతని బాగా ఆకర్షించాయి. 


ఇలా ఉండగా అలాంటి ప్రియాంక అరుల్ ప్రస్తుతం మాత్రం నితిన్ తో కలిసి బోల్డ్ సీన్స్ చేసేందుకు రెడీ అవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  వాస్తవానికి హాలీవుడ్ లో ఆయుష్మాన్ రాధిక మధ్య వేడెక్కించే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఈ సీన్స్ లో నితిన్ ప్రియాంక మధ్య రిపీట్ అవుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక పద్ధతి గల అమ్మాయిలాగా కనిపించిన ప్రియాంక.. ఇప్పుడు నితిన్ తో ఘాటు రొమాన్స్ కు ఎలా ఒప్పుకుంటుంది అనే ప్రశ్న అందరిలోనూ ఏర్పడింది అనే చెప్పాలి. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: