మన సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినప్పుడే కాస్త డబ్బులు సంపాదించుకొని వెనక్కి వేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో అవకాశాలు రాకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సినీ ప్రముఖులను మనము చాలా మందిని చూసాము కూడా. అందుకు ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా చాలా మంది సినీ ప్రముఖులు సైడ్ బిజినెస్ ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు సైడ్ బిజినెస్ లో పెట్టుబడులు పెడుతూ మంచి లాభాలను పొందుతున్నారు అనే చెప్పాలి. 


ఇక ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలతో పాటు వేరు వేరు బిజినెస్ లు మొదలుపెట్టారని చెప్పాలి. ఇక ఇటీవల మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాదులోని గచ్చిబౌలి లో AMB సినిమాస్ అంటూ మల్టీప్లెక్స్ లో ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. 


ఇదే రీతిలో ప్రముఖ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి రంగ ప్రవేశం చేశారు అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ రాజమండ్రిలో ఒక మల్టీప్లెక్స్ ను నిర్మాణం చేపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్క థియేటర్ కన్నా మల్టీప్లెక్స్ బిజినెస్ లు బాగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కూడా ఇదే బిజినెస్ మొదలు పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అవకాశాలు ఉన్నపుడే అందిపుచ్చుకోవడం మానవ జీవితం. వీరితో పటు సినీ ఇండస్ట్రీలో చాల మంది రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదిస్తున్నారని వినికిడి. ఎవరి అభిరుచి తగ్గ వారు సినిమాలను చేస్తున్న వారికీ తెలిసిన బిజినెస్ లలో రాణిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: