నిజానికి కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే హిట్, ఫ్లాప్ ఏదో ఒకటి తేలడంతో ఒకటి రెండు వారాల్లో ఆ సినిమాని జనం మర్చిపోవడం పరపాటుగా అయిపోయింది. నిజానికి కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యే విధానాన్ని చూసి జనాలే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఆశ్చర్య పడుతూ ఉంటారు. ఈ కోవలోకే గీత గోవిందం సినిమా కూడా వస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.

 

అయితే 2018 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ సినిమా నిర్మించిన వారికి కూడా ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు అట. నిజానికి ఆ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రధానంగా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది.


నిజానికి అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇలాంటి సినిమా రావడం అందరూ ఒకలా ఆలోచించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ నటనతో చాలా మంది తనకు ఫాన్స్ గా చేసుకున్నాడు. ఇక ఆ సినిమా కేవలం పది కోట్లు ఖర్చు పెడితే దానికి ఏకంగా 130 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఇక అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమాల్లో గీత గోవిందం సినిమా కూడా ఒకటి. ఆ సినిమా మొదట గీతా ఆర్ట్స్ నిర్మాతలకు చెప్పినప్పుడు అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నాడట. అయితే అప్పుడు బన్నీ ఇది మంచి హిట్ సినిమా అని చెప్పేశారని దర్శకుడు పరుశురాం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 


అయితే గీత గోవిందం కథను వినగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే ఆయన అప్పటికే సరైనోడు లాంటి మాస్ సినిమాని తెరకెక్కించి అభిమానుల అంచనాలపై సినిమా కథ ఎఫెక్ట్ పడవచ్చని అర్జున్ చేయలేదట. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొంత మంది హీరోలను రెఫర్ చేయగా ఆ సినిమా చేయడానికి ఎవరు ఒప్పుకోలేదట. అయితే చివరకు పెళ్లిచూపులు సినిమా చేసిన విజయ్ దేవరకొండను దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: