ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ చాపకింద నీరులాగా తరుణంలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ మేరకు ప్రజలు అందరు కూడా ఇళ్ల వద్దనే ఉంటూ కరోనా వైరస్ నివారణ చర్యలు పాటిస్తున్నారని చెప్పాలి. ఈ తరుణంలోనే కొందరు తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు వినూత్న రీతిలో ఆలోచించి ఇంట్లో ఉంటూనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారని చెప్పాలి. ఇక హీరోలంతా " బి ది రియల్ మాన్ " అంటూ ఛాలెంజ్ లు చేస్తూ ఇంట్లో ఆడవారికి సహాయపడాలని చెబుతూ ఉంటే... మెగా ఫ్యామిలీ మాత్రం వారు చాలా ఇష్టపడే మేకప్ టెక్నిక్స్ పై ఒక వీడియో తీయడం జరిగింది.

 


ఇక ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ అమ్మాయిలు అంతా " పాస్ ది బ్రష్ " అంటూ మేకప్ వేసుకోక ముందు మేకప్ తర్వాత కనిపిస్తూ డాన్స్ చేయడం జరిగింది. వీడియోలో మెగాస్టార్ చిరు కూతుర్లతో పాటు.. నాగబాబు కూతురు నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తో పాటు మెగా ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా చేసుకుని పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యిందనే చెప్పాలి. చాలామంది లేడీ ఆడియన్స్ కూడా వారికి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. కానీ తాజాగా ఇంటర్వ్యూలో ఈ  వీడియో తీయడానికి ముఖ్య కారణం శ్రీజ అక్క అని నాగబాబు కూతురు నిహారిక తెలియజేసింది. 

 


ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో సమయాన్ని గడుపుతున్న నాగబాబు కూతురు నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా పెంచడంతో పాటు పలు మీడియా సంస్థలకు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ ఇస్తూ విషయాలపై స్పందించడం జరుగుతుంది. ఇక ఈ తరుణంలోనే ఒక ఇంటర్వ్యూలో ఈ మేకప్ ఛాలెంజ్ ఆలోచన ఎవరిది మీకు ఎందుకు చేయాలనిపించింది అని ప్రశ్నించగా నిహారిక తమకు ఆలోచన ఎలా పుట్టుకొచ్చింది ఎవరు ఈ ఐడియా ఇచ్చారు అని అడిగారు. తమ ఫ్యామిలీ లేడీస్ వాట్సాప్ గ్రూప్ లో చిరు కూతురు శ్రీజ షేర్ చేసిన ఒక వీడియో చూశాక.. మేకప్ చాలెంజ్ కూడా చేయాలనే ఆలోచన వచ్చిందని నిహారిక తెలియజేసింది. అయితే వాస్తవానికి ఆ వీడియో హిందీలో ఉండగా తెలుగులో కూడా చేస్తే చాలా బాగుంటుంది అని.. చేయడం జరిగింది అని తెలిపింది. ఆ తర్వాత ఒక్కొక్కరికి క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసుకుని ఎడిట్ చేసి వీడియోని రెడీ చేశామని తెలియచేసింది నాగబాబు కూతురు నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి: