వెండితెరపై కొన్ని జంటల కెమిస్ట్రీ ఎంతో బాగా వర్క్ ఔట్ అవుతుంది. అలాంటి జంటలు వెండి తెరపై చూస్తుంటే చూడ ముచ్చటేస్తుంది.  బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టి వెండి తెరపై  తన సత్తా చాటింది అవికా గౌర్.  చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిన్నది తర్వాత బాలీవుడ్ లో ఒకటీ రెండు సినిమాల్లో నటించి తెలుగు లో రాజ్ తరుణ్ హీరోగా ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఇక షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం అయి దర్శకుడిగా మారాలని వచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరోగా మారాడు. 

 

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా మంచి హిట్ అందుకున్న తర్వాత వరుసగా మంచి విజయాలు అందుకున్నాడు.  గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ ప్రేమకథకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సినిమా చూపిస్త మావ' కూడా బాక్సాఫిస్ దగ్గర భారీ వసూళ్లనే రాబట్టింది.  ఆ తర్వాత ఈ జంట మళ్లీ తెరపై కనిపించలేదు. కాకపోతే హీరోగా రాజ్ తరుణ్ కొనసాగుతున్నా.. ఆ మద్య అవికా గౌర్ తెలుగు సినిమాలకు దూరమైంది.  ఇటీవల ఓంకార్ దర్శకత్వంలోవచ్చిన ‘రాజు గారిగది3’ తో రీ ఎంట్రీ ఇచ్చింది. 

 

తాజాగా అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. గతంలో రాజ్ తరుణ్ హీరోగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'ను తెరకెక్కించిన శ్రీనివాస్ గవిరెడ్డి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులు నుంచి రాజ్ తరుణ్ కి కూడా మంచి హిట్స్ లేవు.. మళ్లీ ఈ జంట కలిస్తే హిట్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: