క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విళ‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబర్ నెలలో చైనా దేశంలో పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ అనాతి కాలంలోనేయావత్తు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది.  రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇక‌ ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల రెండు ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డ్డారు. అలాగే క‌రోనా పాజిటివ్ కేసులు ముప్పై ల‌క్ష‌ల‌కు చేర‌వ అవుతోంది.

 

ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారికి మందు లేకపోవడంతో నివారణ పైనే దేశ‌దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. అలాగే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించి.. ప్ర‌జ‌లను బ‌య‌ట‌కు రాకుండా చేసింది. దీంతో ప్ర‌జ‌లందూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఇక షూటింగ్స్ లేక సినీ తార‌లు కూడా ఇంటిప‌ట్టునే కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ న‌టుడు ప్రకాష్ రాజ్ ఈ లాక్ డౌన్ కాలంలో భార్యాపిల్లలతో తన ఫామ్ హైజ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

 

అయితే ప్రకాష్ రాజ్ తన ఫామ్ హౌజ్‌లో పండిన మామిడికాయలను అమ్ముతున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాష్ రాజ్‌కు తోడుగా త‌న నాలుగేళ్ల కుమారుడు కూడా మామిడికాయ‌ల‌ను అమ్మాడు. దీంతో ప్ర‌కాష్ రాజ్ ఓ ఫోటో పోస్ట్ చేస్తూ.. తన కుమారుడు తన తోటలో పండిన మామిడికాయలను అమ్ముతూ.. ప్రకృతిలో ఒడిలో ఒదిగిపోయాడని పేర్కోన్నాడు.  ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్‌గా మారింది. ఏదైతేనేం కుమారుడితో మామిడికాయ‌లు అమ్మించాడు ప్ర‌కాష్ రాజ్‌. కాగా,  ఏ పాత్రలోకైనా ఇటే ఒదిగిపోయే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం రంగ మార్తండ సినిమాలో న‌టిస్తున్నారు. ఇక లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ లేక‌పోవ‌డంతో కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: