ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ సంవత్సరం మొదట్లో వివాదంలో చిక్కుకున్న పృథ్వీ తాజాగా టిక్ టాక్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పృథ్వీరాజ్ టిక్ టాక్ వీడియోలో కల్తీ వ్యక్తులు పాలిస్తున్న కాలమిది అని ఎవరినీ నమ్మవద్దని వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు పృథ్వీ ఎవరినో ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తే జగన్ ను ఉద్దేశించి పృథ్వీ మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పృథ్వీ స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. మరికొందరు తనను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఏపీ ప్రభుత్వం తప్పించడం వల్లే పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని చెబుతున్నారు.
టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పృథ్వీ వీడియో పోస్ట్ జగన్ ను ఉద్దేశించి పృథ్వీ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అభిమానులు మాత్రం పృథ్వీకి జగన్ అంటే ఎంతో అభిమానమని.... ఎవరినో ఉద్దేశించి పృథ్వీ పోస్ట్ చేస్తే జగన్ ను ఉద్దేశించి పృథ్వీ మాట్లాడారని దుష్ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం జనవరి నెలలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు.
ఎస్వీబీసీ ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఆడియో టేపులు వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వం పృథ్వీకి రాజీనామా చేయాలని సూచించింది. పృథ్వీ మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. తనకు మహిళలంటే అపార గౌరవమని... ఎవరో కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు ఎస్వీబీసీ చైర్మన్ గా అవకాశం రావడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారని.... తనపై ఎవరో కావాలనే కుట్ర చేశారని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఏలుతున్న కల్తీ నా కొడుకులు అంటే ఎవరో..??😀😀
— tdp Balaji® (@tdpbalaji) April 26, 2020
ఇంతకీ ఈయన ఆ #YCPcovIDIOTS బాచ్ లో నుంచి బయటకు ఎప్పుడొచ్చేశారో..🤔🤔#UnfitCMJagan #A2ReddySpreadsCorona pic.twitter.com/t6VfTY9ye9