బాలయ్య అంటే అంతే. ఆయన ముక్కుసూటితనం అంతే. ఆయనకు నచ్చితే ఇక అంతే. ఎవరు చెప్పినా వినరు. తన గురించి కూడా ఆలోచన చేయరు. ఇవన్నీ వింటున్న మాటలే.  టాలీవుడ్లో ఇండస్ట్రీ అంతా ఒక వైపు ఉంటే బాలయ్య మాత్రం తనదైన ధోరణిలో ఉంటారు. అయితే ఆయన వాల్యూ, ఆయన ప్లేస్ అలాగే ఉంటాయి. ఆయన విశ్వ విఖ్యాత నటుడు అన్న గారి వారసుడు. అందువల్ల ఆయన సీటుని కదిపేవారు కూడా ఎవరూ లేరు.

 

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఆయన స్టోరీ జడ్జిమెంట్ కంటే కూడా తాను నమ్మిన డైరెక్టర్ కే ఎక్కువ విలువ ఇస్తారు. ఇక తాను మాట ఇచ్చారంటే ఆ మూవీ ఫెయిల్ అవుతుందని తెలిసినా కూడా వెనకకు అడుగు వేయరు. ఇపుడు బాలయ్య డేరింగ్ డెసిషన్ ఒకటి హాట్ డిస్కషన్ గా  మారింది. అదేంటి అంటే ఆయన బీ గోపాల్ డైరెక్షన్ లో యాక్ట్ చేయబోతున్నారుట.

 

ఎపుడు 2003లో మూవీ. మరెపుడు 2020 యియర్. అంటే పదిహేడేళ్ళు  అయ్యాయి. ఆ మధ్యలో కొన్ని తరాలు మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. కానీ బాలయ్య‌ మాత్రం బీ గోపాల్ కే ఓటేశారు. ఆయన్ని మళ్ళీ తట్టి  లేపి డైరెక్టర్ ని చేయిస్తున్నారు. మెగా ఫోన్ పట్టిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బీ గోపాల్ ఫేడౌట్ అయ్యారనే అనాలి.

 

ఆయన మెగా ఫోన్ పట్టి కూడా దశాబ్దం పై దాటుదోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే బుర్రా సాయి మాధవ్ రాసిన కధకు బీ గోపాల్ డైరెక్షన్ అన్న మాట. ఈ మూవీని బాలయ్య పుట్టిన రోజు అయిన జూన్ 10న కొబ్బరి కాయ కొట్టి ప్రారంభిస్తారట. ఆ తరువాత వీలుని బట్టి షూటింగ్ జరుపుతారుట. ఇవన్నీ బాగానే ఉన్నా బాలయ్య, బీ గోపాల్ కాంబో అంటేనే అసలు  పాజిటివ్ బజ్ రావడంలేదు

 

కానీ బాలయ్య ఎందుకో ఈ స్టెప్ తీసుకున్నడోనని ఫ్యాన్స్ కూడా షాక్ తింటున్నారు. ఇక ఈ మూవీ కంటే ముందు బోయపాటి మూవీని బాలయ్య చేస్తున్నారు. అది కనుక హిట్ అయితే ఈ మూవీ మీద అంచనాలు ఉంటాయేమో చూడాలి. లేలపోతే మాత్రం ఈ కాంబో పట్టాలెక్కేదాకా డౌటేనని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య ఇదే వరసలో తనతో  సినిమాలు అప్పట్లో చేసి హిట్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి, శరత్ వంటి డైరెక్టర్లకు కూడా చాన్స్ ఇచ్చేలా ఉన్నాడని అంటున్నారు. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: