టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతని తో సినిమా చేయడానికి కొందరు నిర్మాతలు కాస్త గట్టిగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దర్శకులు అయితే ముందు మంచి కథ ఉంటే అతని వద్దకే తీసుకుని వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఒక సినిమాలో చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు దూకుడు పెంచాడు. ఇప్పుడు ఆయన పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయని అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను వచ్చే నెల మొదలుపెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇది పక్కన పెడితే అతను ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అక్కడ తానే ఒక సినిమాను స్వయంగా చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. అక్కడ సినిమా చేయడానికి గానూ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 

 

ముందు నుంచి బాలీవుడ్ సినిమాలను దూరంగా ఉంచే మహేష్ బాబు ఇప్పుడు అక్కడ సినిమా చెయ్యాలి అనుకోవడానికి ప్రధాన కారణం ఎంతా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కరణ్ జోహార్ తో చర్చలు జరుపుతున్నారని ఆయన ఓకే చెప్తే ఈ సినిమాను ముందు అక్కడి నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారట. అక్కడి సంగీత దర్శకుడి తో మహేష్ బాబు చర్చలు కూడా జరిపారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మహేష్ చేస్తున్న సినిమాకు నిర్మాత ఎవరూ దొరకలేదు అని అంటున్నారు. మరి ఎవరు నిర్మాత అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: